'కాంగ్రెస్...మీ చావు మీరే చావండంటోంది' | Julakanti ranga reddy takes on congress party | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్...మీ చావు మీరే చావండంటోంది'

Jan 17 2014 12:38 PM | Updated on Mar 18 2019 7:55 PM

'కాంగ్రెస్...మీ చావు మీరే చావండంటోంది' - Sakshi

'కాంగ్రెస్...మీ చావు మీరే చావండంటోంది'

తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తాం.. మీ చావు మీరు చావండి అన్నట్లు వ్యహరిస్తుందని సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం వైఖరిపై నిప్పులు చెరిగారు.

తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తాం.. మీ చావు మీరు చావండి అన్నట్లు వ్యహరిస్తుందని సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం వైఖరిపై నిప్పులు చెరిగారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలలో వచ్చిన ఉద్యమాల వల్ల రాష్ట్రం లక్షల కోట్ల రూపాయిలను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజన ఆషామాషి సమస్య కదాని, ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని ఆయన సభ్యులకు హితవు పలికారు. కాలయాపన చేయకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

 

అభివృద్ధికి కావాల్సిన నిధులు, విధానాలకు సంబంధించిన విభజన బిల్లులో కేంద్రం ఎక్కడ పేర్కొనలేదని అన్నారు. కేంద్ర నిధులు ప్రస్తావన లేకుండా విభజన ప్రక్రియపై చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బిల్లుగా మార్చాలని కేంద్రానికి సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో నలుగురు సీఎంలు మారారు. ఆ నలుగురు సీఎంలలో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేకపోయారని జూలకంటి రంగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో పాలన స్తంభించిందని, మంత్రులు తమ తమ ప్రాంతాలకే పరిమితమైయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement