టీడీపీ నేతల దీక్షలు వృధా: జేసీ దివాకర్‌రెడ్డి | JC Diwakar Reddy Praises YS Jagan Due To Rayalaseema Project At Anantapur | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దీక్షలు వృధా: జేసీ దివాకర్‌రెడ్డి

May 21 2020 12:59 PM | Updated on May 21 2020 2:46 PM

JC Diwakar Reddy Praises YS Jagan Due To Rayalaseema Project At Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృధా అని తెలిపారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదని ఆయన చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారని జేసీ దివాకర్‌రెడ్డి గుర్తు చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement