వైఎస్‌ జగన్‌ వీరాభిమాని వినూత్న ప్రదర్శన | YS Jagan mohan reddy fan is an innovative performance | Sakshi
Sakshi News home page

జగన్‌ వీరాభిమాని వినూత్న ప్రదర్శన

Oct 27 2017 12:31 PM | Updated on Oct 20 2018 4:52 PM

Jagan fan is an innovative performance - Sakshi

తెనాలి రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఓ వ్యక్తి.. ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను పోలిన బండ్లను ప్రదర్శించి కొలుపుల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్‌ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు.

మొక్కుబడులు ఉన్న వారు కొలుపుల్లో బండ్లను కట్టి, గ్రామంలో ఊరేగిస్తారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రతిబింబించే తొమ్మిది ట్రాక్టర్లను రామిరెడ్డి కట్టించారు. వాటికి వైఎస్సార్‌సీపీ జెండా రంగులను వేయించారు. మద్య నిషేదం, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ రైతు భరోసా పథకాల పేరిట అలంకరించిన తొమ్మిది బండ్లను గ్రామ పెద్దలతో కలిసి గ్రామంలో ఊరేగించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నదే తామందరి ఆశగా రామిరెడ్డి చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement