హాజరు శాతం లేని కారణంగా 23 మంది విద్యార్థులను పరీక్షకు హజరు కాకుండా అడ్డుకోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
హాజరు లేదని.. హాల్టికెట్ ఇవ్వలేదు
Mar 2 2016 11:47 AM | Updated on Sep 3 2017 6:51 PM
ప్రొద్దుటూరు: హాజరు శాతం లేని కారణంగా 23 మంది విద్యార్థులను పరీక్షకు హజరు కాకుండా అడ్డుకోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 23 మంది విద్యార్థులకు సరైన హాజరు లేకపోవడంతో కళాశాల ప్రిన్పిపల్ హాల్టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో పరీక్ష సమయానికి వచ్చిన విద్యార్థులు హాల్టికెట్ ఇవ్వాలని ధర్నాకు దిగడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపిచేశారు.
Advertisement
Advertisement