విద్యుత్ అక్రమ వినియోగంపై విజి‘లెన్స్’! | Illegal use of electricity whistles 'lens' | Sakshi
Sakshi News home page

విద్యుత్ అక్రమ వినియోగంపై విజి‘లెన్స్’!

Dec 11 2013 4:23 AM | Updated on Sep 2 2017 1:27 AM

విద్యుత్ అక్రమ వినియోగంపై విజి‘లెన్స్’!

విద్యుత్ అక్రమ వినియోగంపై విజి‘లెన్స్’!

విద్యుత్ అక్రమ వినియోగంపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. మంగళవారం ఆకస్మిక దాడులు చేసి, హడలెత్తించారు. పలాస-

పలాస, న్యూస్‌లైన్: విద్యుత్ అక్రమ వినియోగంపై విజిలెన్స్ అధికారులు  కొరడా ఝులిపించారు. మంగళవారం ఆకస్మిక దాడులు చేసి, హడలెత్తించారు. పలాస- కాశీబుగ్గ పట్టణాలతో పాటు..పలాస మండలం బ్రా హ్మణతర్లాలో అధికారులు దాడులు జరిపి, విద్యుత్ మీ టర్లను పరిశీలించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 26 మందిపై కేసులు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి..అదనపు విద్యుత్‌ను వాడినందుకు అ దనపు చార్జీలతో పాటు అపరాధ రుసుం వసూలు చేస్తామని టెక్కలి డీఈ రవికుమార్ చెప్పారు. ఆయన పర్యవేక్షణలో టెక్కలి డివిజన్‌లోని మొత్తం  16మంది ఏఈ లతో  పాటు టెక్కలి  ఏడీఈ రామకృష్ణ, సోంపేట ఏడీ ఈ పాత్రుడు, నరసన్నపేట ఏడీఈ ఈశ్వరరావు, పలాస ఏఈ మధు  దా డుల్లో పాల్గొన్నారు. ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఈ త నిఖీలు చేపట్టారు.  కేటగిరీ -2 మీటర్లు పరిశీలించారు. పలాస కాశీబుగ్గ పట్టణంలో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నందున..వాటికి మీటర్లు అమర్చకుండా..మీటర్లు ఉన్నా..సక్రమంగా వినియోగించకుండా..విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని  డీఈ చెప్పారు. చౌర్యానికి పాల్పడినా..మీటర్లను సక్రమం గా వినియోగించకున్నా..చర్యలు తప్పవని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement