నగల దుకాణంలో భారీ దొంగతనం | huge robbery in jewellery shop at vinukonda | Sakshi
Sakshi News home page

నగల దుకాణంలో భారీ దొంగతనం

Sep 30 2015 10:55 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది.

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో ప్రధాన కూడలిలో ఉన్న లలితా జ్యువెలరీలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నగలు ఎత్తుకు పోయారు. సుమారు 60 కిలోల వెండి, 200 గ్రాముల బంగారు ఆభరణాలు కలిపి మొత్తం రూ.30 లక్షల విలువైన సొత్తు చోరీ అయిందని దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement