గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది.
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో ప్రధాన కూడలిలో ఉన్న లలితా జ్యువెలరీలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నగలు ఎత్తుకు పోయారు. సుమారు 60 కిలోల వెండి, 200 గ్రాముల బంగారు ఆభరణాలు కలిపి మొత్తం రూ.30 లక్షల విలువైన సొత్తు చోరీ అయిందని దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.