
ఆశలు పండేనా
కర్ణాటకలోని తుంగభద్రజలాశయానికి వరదనీరుపోటెత్తుతోంది. వరుణుడుముఖం చాటేయడంతో.. టీబీడ్యాంపై ఆశలు పెట్టుకున్నజిల్లాలోని దిగువ కాలువ,కర్నూలు-కడప కాలువ ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కర్నూలు(రూరల్)/ఆదోని: కర్ణాటకలోని తుంగభద్రజలాశయానికి వరదనీరుపోటెత్తుతోంది. వరుణుడుముఖం చాటేయడంతో.. టీబీడ్యాంపై ఆశలు పెట్టుకున్నజిల్లాలోని దిగువ కాలువ,కర్నూలు-కడప కాలువ ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎగువ భాగంలోకుండపోత కారణంగాఆదివారం మధ్యాహ్నానికిడ్యాంలోకిసుమారు 90వేల క్యూసెక్కులనీరు వచ్చి చేరుతోంది.
పస్తుతం డ్యాంలో 72టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుఅధికారుల ద్వారా తెలుస్తోంది.ఇదే ఇన్ఫ్లో కొనసాగితే నాలుగైదు రోజుల్లో దిగువకు నీరువిడుదల చేసే అవకాశంఉంది. అదే జరిగితే పదిరోజుల్లో తుంగభద్ర జలాలుజిల్లాకు చేరుకోనున్నాయి. అయితే కర్నూలు-కడప కాలువఆయకట్టుకు ఖరీఫ్లో వరి సాగుకు నీరందించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇందుకు జిల్లాలోవర్షాభావ పరిస్థితులు.. నదిపై కర్ణాటక ప్రభుత్వం అనుమతి లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్న ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. తుంగభద్ర జలాలు ఆర్డీఎస్ను దాటి దిగువనున్న సుంకేసులకు, అక్కడి నుంచి కుడి కాలువైన కేసీకిసాగునీరు అందించాల్సి ఉంది.
ప్రస్తుతం సుంకేసులబ్యారేజీలో 1.09 టీఎంసీల నీరు మాత్రమే నిల్వఉండగా.. కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకుకేసీ ద్వారా రోజుకు సుమారు 100 క్యూసెక్కుల నీరువిడుదలవుతోంది. కేసీ కెనాల్ కింద కర్నూలు-కడపజిల్లాల్లో మొత్తం ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలు కాగా..కేసీ కెనాల్ కింద ఖరీఫ్లో కర్నూలు జిల్లాలోనే 1.10లక్షల ఎకరాల్లో వరి, కడప జిల్లాలో 60వేల ఎకరాల్లోవరి సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగారైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే ఉత్తమమని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈనెల 30న నిర్వహించనున్న సాగునీటి సలహామండలి సమావేశంలోనే అధికారులు ఇదే విషయాన్నిస్పష్టం చేయనున్నట్లు సమాచారం.గస్తీకి ప్రత్యేక బృందాలుదిగువ కాలువ కింద జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు50వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది జిల్లాలోనెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలుపూర్తిస్థాయిలో వేసుకోలేని పరిస్థితి. కర్ణాటకలో భారీవర్షాల కారణంగా టీబీ డ్యాంలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం నీటిపారుదల శాఖ జిల్లా అధికారులు ఎల్ఎల్సీకి రోజుకు 690క్యూసెక్కులు చొప్పున సాగునీరు విడుదల చేయాలనిటీబీ బోర్డు అధికారులకు ఇండెంట్ పెట్టారు.
డ్యాంలోకివచ్చే నీరు అధికంగా ఉండటంతో అదే రోజు దిగువకాలువకు నీరు విడుదల చేశారు. కర్ణాటకలో జలచౌర్యం కారణంగా ఆయకట్టు రైతులు తరచూ గగ్గోలుపెడుతుండటం తెలిసిందే. ఈ ఏడాది ఆ పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఇరిగేషన్ అధికారులు కాల్వ131 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకున్న 30 డిస్ట్రిబ్యూటరీల్లో ఒక్కో దానికి ముగ్గురు లస్కర్లు.. ఐదుగురువీఆర్వోలు, వీఆర్ఏలు, సమీప ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్,ఎంపీడీఓ, పంచాయతీరాజ్ఇంజనీర్లను బృందాలుగానియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. 250 కి.మీ.నుంచి 324 కి.మీ. వరకున్న 25 డిస్ట్రిబ్యూటరీలకుఒక్కోదానికి 3 నుంచి 5 లస్కర్లు, ఆయా మండలాలసబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులచే బృందం ఏర్పాటు చేసినీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని భావిస్తున్నారు.
ప్రత్యేకబృందాల నివేదికను నీటి పారుదల శాఖ అధికారులుగత శనివారం కలెక్టర్ విజయమోహన్కు అందజేశారు.వరి మళ్లు సిద్ధం చేసిన రైతులు: ఎల్లెల్సీ పరీవాహకప్రాంతంలోని ఆయా మండలాల రైతులు బోర్డు,బావులు, తుంగభద్ర, వేదావతి నదుల కింద వరినారుమళ్లు పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఇప్పటికే 20 నుంచి30 రోజుల వరి నారు పచ్చగా కళకళలాడుతోంది.నలభై రోజుల్లోపు వరి నాట్లు వేయాల్సి ఉంది. కాలువకు నీరు విడుదల కావడంతో రైతులు తమ భూములను అరక దున్ని చదును చేసుకుంటున్నారు.