వెంకన్నను దర్శించుకున్న మంచు విష్ణు, శ్రీదేవి | Hero manchu vishnu vardhan visits tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్నను దర్శించుకున్న మంచు విష్ణు, శ్రీదేవి

Oct 29 2013 12:09 PM | Updated on Sep 2 2017 12:06 AM

తిరుమలలో శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు.

తిరుమలలో శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఇటీవల విడుదలై విజయఢంకా మోగిస్తున్న దూసుకెళ్తా చిత్రం విజయోత్సవంలో భాగంగా హీరో మంచు విష్ణువర్థన్ తన చిత్ర యూనిట్తో కలసి ఈ రోజు ఉదయం కలియుగ దైవాన్ని దర్శించుకున్నారు.

 

అనంతరం ఆయన మాట్లాడుతూ...  దూసుకెళ్తా చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆ చిత్రాన్ని తమిళ వర్షన్లో త్వరలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయన్నారు. అలాగే ప్రముఖ నటీ మంజుల కుమార్తె ,  వర్థమాన నటీ శ్రీదేవి కూడా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నటీ శ్రీదేవి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement