మంథని డివిజన్లో పొంగిపోర్లుతున్న వాగులు | heavy rains in manthani division | Sakshi
Sakshi News home page

మంథని డివిజన్లో పొంగిపోర్లుతున్న వాగులు

Aug 16 2013 9:52 AM | Updated on Sep 1 2017 9:52 PM

కరీంనగర్ జిల్లా మంథని డివిజన్లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దంపేట, సర్వాయిపేట, పంచెన వాగులు శుక్రవారం పొంగిపొర్లుతున్నాయి.

కరీంనగర్ జిల్లా మంధని డివిజన్లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దంపేట, సర్వాయిపేట, పంచెన వాగులు శుక్రవారం పొంగిపొర్లుతున్నాయి. దీంతో మహదేవపూర్ మండలంలోని 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహాముత్తారంలోని దౌత్పల్లి వాగులో ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.

 

దాంతో ఆ మండలంలోని 5 గ్రామాలలో రాకపోకలు బంద్ అయినాయి. అయితే అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే ఖమ్మం జిల్లాలోని చోక్కాలలో కురిసిన భారీ వర్షానికి మూడు ఇళ్లు నేలమట్టం అయినాయి. ఆ ప్రమాదంలో ముత్తమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది.
 

Advertisement
 
Advertisement
Advertisement