తిరుమలలో కుంభవృష్టి | heavy rain in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కుంభవృష్టి

May 18 2015 1:00 AM | Updated on Sep 3 2017 2:14 AM

తిరుమలలో కుంభవృష్టి

తిరుమలలో కుంభవృష్టి

తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడి, ఆలయం వద్దనీరు నిలిచింది.

తిరుమల: తిరుమలలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడి, ఆలయం వద్దనీరు నిలిచింది. వర్షంలో భక్తుల అవస్థలు పడ్డారు. రెండో ఘాట్‌రోడ్డులో చివరి 5 మలుపుల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఘాట్‌రోడ్డు సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు.  

శ్రీవారి సర్వదర్శనం క్యూలో తోపులాట: తిరుమలలో ఆదివారం సర్వ దర్శనం క్యూలో తోపులాట చోటుచేసుకుంది. చిన్నారులు, వృద్ధులు క్యూలో నలిగిపోయారు. ఇక్కడి సిబ్బందిలో సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణమని భక్తులు విమర్శిస్తున్నారు.

రికార్డు స్థాయిలో దర్శనం:  శనివారం రికార్డు స్థాయిలో 90వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం సర్వ దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు బయట కిలోమీటరు వరకు క్యూ కట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement