ఉలవపాడు: ఉలవపాడులోని ప్రభుత్వ వైద్యశాలలో చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఆఫ్ ఉలవపాడు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆరోగ్య పోటీలు నిర్వహించగా 110 మంది పాల్గొన్నారు. పీడియాట్రిక్ వైద్యుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలను సోమవారం ప్రకటించారు. బేబీ ఆఫ్ ఉలవపాడు మేల్ విభాగంలో దామతోటి శ్రావణ్ కుమార్, ఫిమేల్ విభాగంలో పల్లకి చేత్రప్రియ విజేతలుగా నిలిచారు. వైద్యశాల సూపరింటెండెంట్ శోభారాణి, బ్రహ్మయ్య బహుమతులు అందజేశారు. వీరితో పాటు మరో 11 మంది పిల్లలకు బహుమతులిచ్చారు. టీకాలు వేస్తున్న సమయం, బరువు, తల్లితండ్రుల ఆరోగ్య సూచనలు, పిల్లల ఆరోగ్యం ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు వైద్యులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కరీమ్.. విటమిన్ డ్రాప్స్ అందజేశారు. కార్యక్రమంలో దంతæ వైద్యులు సురేష్, యూనియన్ నాయకులు అల్తాఫ్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
Breadcrumb
Related News by category
-
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. నియమించిన ‘ఈసీ’
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) ముగ్గురు సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్కుమార్గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. -
గోదారిలో గాలి కబుర్లే..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నవతరం రాజకీయాలకు ఆలంబన అని...ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన ఆలోచనలతో పురుడుపోసుకున్న పార్టీ అని..పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అగ్రాసనం వేస్తామనే అజెండాతో వచ్చిందీ జనసేన అని చెప్పడంతో నిజమనుకుని నమ్మి జనసేనలో పలువురు చేరారు. ఇన్నేళ్లూ ఆ పార్టీని భుజాన వేసుకుని కార్యక్రమాల కోసం లక్షలు తగలేసుకున్నారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి అవన్నీ గాలి కబుర్లేనని తెలిసొచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే ఆవేదన ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటముల ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ముఖం చాటేసినప్పుడే ఆ పార్టీకి ఓ సిద్ధాంతం లేదని తేలిపోయిందని అప్పట్లోనే ఆ శ్రేణులు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును విభేదించాయి. అయినా, ఆయన పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి పొత్తులంటూ తలాతోకా లేని నిర్ణయాలతో పార్టీని, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేసేశారని మండి పడుతున్నారు.పొత్తుతో మరింత దిగజారి..టీడీపీతో పొత్తులో కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తారని పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. చివరకు మూడింట ఒక వంతు సీట్ల కంటే తక్కువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిని సమర్థించుకుంటూ పవన్ కల్యాణ్..‘మన బలం మనం తెలుసుకోకుండా ఎన్ని అంటే అన్ని సీట్లు ఎలా అడిగేస్తాం? గత ఎన్నికల్లో కనీసం నన్ను కూడా గెలిపించుకోలేకపోయామని ప్రశ్నిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించారు.గోదావరి జిల్లాలపైనే ఆశలు!రాష్ట్రంలో కొద్దోగొప్పో పార్టీకి మనుగడ ఉందంటే అది గోదావరి జిల్లాల్లోనేనని ఆ పార్టీ నాయకుల మాట. దీనికి బలం చేకూర్చేలా ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సగం ఈ జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన 11 అసెంబ్లీ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఆ పార్టీకి బలం, బలగం ఉందనే నమ్మకంతో ఈ జిల్లాల పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.కానీ పార్టీని వీడుతున్న నేతలు ఈ జిల్లాల నుంచే ఎందుకు ఎక్కువగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది గత సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ జిల్లాల పైనే ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి ఏకైక స్థానం రాజోలులో మాత్రమే ఆ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా గెలుపొందింది. చివరకు రాష్ట్రంలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.ఆ పార్టీకి దూరంగా..పార్టీపై నమ్మకంతో ఇంత కాలం పార్టీని భుజాన మోసిన నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్యమైన నాయకులు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, ముమ్మిడివరం, అమలాపురం, జగ్గంపేట, ఆచంట ఇన్చార్జీలు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, పాఠంశెట్టి సూర్యచంద్ర, చేగొండి, అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జి డీఎంఆర్ శేఖర్ వంటి సుమారు డజను మందికి పైగా నాయకులు జనసేనకు గుడ్బై చెప్పారు. సిద్ధాంతం మాట దేవుడెరుగు కనీసం పార్టీలో విలువనేదే లేకుండా చేసేశారని, ఆత్మాభిమానం చంపుకుని ఇంకా ఆ పార్టీలో కొనసాగలేమని అంటున్నారు.ఇవి చదవండి: ఓహెూ.. అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది! -
కర్నూలు.. ఫ్యాన్ జోరు!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక పోరు ఏకపక్షంగా కానుందా? 2019 ఫలితాలే పునరావృతం కాను న్నాయా? 2 ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేయనుందా? అంటే జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పారీ్టల బలాబలాలు విశ్లేíÙస్తే అవుననే తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత, ఇటీవల సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, ఆచరణ సాధ్యమయ్యే హామీలతో విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల మద్దతు రావడం వంటి అంశాలతో వైఎస్సార్సీపీ జోష్లో ఉంటే, చంద్రబాబు సభలకు సరైన స్పందన లేకపోవడం, చాలా నియోజకవర్గాల్లో నాయకత్వలేమి, వర్గ విభేదాలతో టీడీపీ ఈ దఫా కూడా బోణీ కొట్టడం కష్టమేననే భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి అత్యంత బలంగా ఉంది. ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటికీ చేయని సంక్షేమ ఫలాలు అందాయి. ప్రతీ గ్రా మంలో అభివృద్ధి జరిగింది. దీనికి తోడు తమ నాయకు డిని మరోసారి సీఎంగా చూడాలనే ఆ కాంక్ష ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.కర్నూలులో గెలుపు గ్యారంటీ..రాష్ట్రంలోనే మైనార్టీ ఓట్లు అత్యధికంగా (1.15లక్షలు) ఉండే నియోజకవర్గం కర్నూలు. ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ను వైఎస్సార్సీపీ బరిలోకి దింపింది.ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డితో పాటు పార్టీ మొత్తం ఇంతియాజ్ గెలుపు కోసం పని చేస్తోంది. మైనారీ్టలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. మరోవైపు టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో కొనసాగుతూ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. రాజకీయాన్ని కూడా ‘బిజినెస్’గా చూసే టీజీ కుటుంబాన్ని గత రెండు దఫాలు ప్రజలు ఓడించారు. మైనార్టీ ఓట్లు దూరమవుతాయనే భావనతో బీజేపీని టీజీ భరత్ దగ్గరకు రానీయడం లేదు. దీంతో బీజేపీ నేతలు కూడా టీజీపై గుర్రుగా ఉన్నారు. కోడుమూరులో సునాయాసమే..కోడుమూరు(ఎస్సీ) టీడీపీలో గ్రూపు తగాదాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంది. తనకు కాకుండా బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇచ్చారని ఇన్చార్జ్ ఆకేపోగు ప్రభాకర్ ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. తన ప్రమేయం లేకుండా ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి సూచించిన అభ్యరి్థకి టికెట్ ఇవ్వడంతో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గం దస్తగిరికి సహకరించడం లేదు. ఇటీవల సయోధ్య కుదిరినట్లు చెబుతున్నా సహకారం లేదు. మరోవైపు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్రెడ్డి ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో వైఎస్సార్సీపీ బలం మరింత పెరిగింది.ఈ దఫా కూడా వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉంది. ‘ఆలూరు’లో పెరిగిన వైఎస్సార్సీపీ బలంఆలూరులో చిప్పగిరి జెడ్పీటీసీ వాలీ్మకి నేత విరూపాక్షి వైఎస్సార్సీపీ తరపున బరిలో ఉన్నారు. ఐదేళ్లు మంత్రి పదవి అనుభవించి పార్టీని వీడి వెళ్లిపోయిన గుమ్మనూరు జయరాం సిఫార్సుతో ఇక్కడ వీరభద్రగౌడ్కు టికెట్ ఇచ్చింది. దీంతో ఇక్కడ వాలీ్మకులంతా ఏకమయ్యారు. దీనికి తోడు టీడీపీ నుంచి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కురబ వర్గానికి చెందిన శశికళ వైఎస్సార్సీపీలో చేరారు. కోట్ల హరిచక్రపాణిరెడ్డి కోడుమూరుతో పాటు ఆలూరుపై పట్టున్న నాయకుడు. ఇక్కడ కురబ, బోయ వర్గాలు వైఎస్సార్సీపీతోనే ఉన్నాయి. దీంతో కచి్చతంగా గెలుస్తామనే భావనలో వైఎస్సార్సీపీ ఉంది. శ్రీశైలంలో శివతాండవమే..శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు. టీడీపీ నేత బుడ్డా రాజశేఖరరెడ్డి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో ఉంటున్నారు. ఓటమి భయంతోనే బుడ్డా ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీలోకి వెళ్లి ప్రజల్లో బుడ్డా విశ్వసనీయత కోల్పోయారు. దీంతో టీడీపీ నేతలు కూడా ఇతని కోసం గట్టిగా పని చేసే పరిస్థితులు లేవు. ఏరాసు ప్రతాప్రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ‘పోచా’దే నంద్యాల!నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ. ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడటంతో పాటు ఇటు పార్టీ నేతలతో అటు పార్లమెంట్ పరిధిలోని ప్రజలతో మంచిగా ఉన్నారు. మరోవైపు టీడీపీ వేండ్ర శివానందరెడ్డిని కాదని, చివరి నిమిషంలో బీజేపీ నేత బైరెడ్డి శబరికి ‘పచ్చ కండువా వేయించి ఎంపీగా పోటీ చేయిస్తోంది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి 2014లోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. పైగా బైరెడ్డిని టీడీపీ నేతలే స్వాగతించడం లేదు. పార్లమెంట్లోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ హవానే ఉంది. అసెంబ్లీలు స్వీప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నంద్యాల మరోసారి పోచా వశం కానుంది. పత్తికొండలో టీడీపీ పరాభవం తథ్యం!పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నిత్యం జనంతో మమేకం అవుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఐదేళ్లపాటు పారీ్టకి అందుబాటులో లేరు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కూడా వీరికి దూరంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు అవకాశాలు స్వల్పమే.ఎమ్మిగనూరు.. ఏకపక్షం!ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్నారు. బీసీలకు టికెట్ ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కనపెట్టారు. దీంతో ఇక్కడ చేనేతలు, బీసీలు రేణుక కోసం ఏకమయ్యారు. చెన్నకేశవరెడ్డి కూడా రేణుక గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు జయనాగేశ్వరరెడ్డికి కోట్ల వర్గం నుంచి కూడా మద్దతు లేదు. ఇక్కడ కూడా ‘బుట్టా’కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మంత్రాలయం, ఆదోనిలో మురిపిస్తున్న ఫ్యాన్..మంత్రాలయం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి బాలనాగిరెడ్డికి ఓటమి లేదు. నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయనేత. మరోవైపు తిక్కారెడ్డిని కాదని, బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రకు టీడీపీ టికెట్ ఇచి్చంది. దీనిపై తిక్కారెడ్డి ప్రత్యక్షంగా నిరసన చేశారు. దీంతో జిల్లా అధ్యక్షపదవి ఇతనికి కట్టబెట్టింది. అయినా రాఘవేంద్రకు సహకరించడం లేదు. మరోవైపు తన అధ్యక్ష పదవిని తీయడంపై బీటీ నాయుడు గుర్రుగా ఉన్నారు. ఆదోనిలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షి నాయుడును కాదని పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ రెండూ బలహీనంగా ఉన్నాయి. దీంతో బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి.గెలుపు బాటలో ‘రామయ్య’ కర్నూలు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పోటీ చేస్తున్నారు. పేద వ్యక్తి. పార్లమెంట్లో బలమైన ‘వాల్మీకి’ వర్గానికి చెందిన నేత. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో పార్లమెంట్లో విస్తృత పరిచయాలున్నాయి. రామయ్య తెలియని వ్యక్తి లేరు. అజాత శత్రువైన రామయ్యకు ‘వాలీ్మకుల’తో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. 7 అసెంబ్లీలలో ‘ఫ్యాన్’ గాలి వీస్తోంది. మరోవైపు టీడీపీకి అభ్యర్థులు లేక పంచలింగాల నాగరాజు అనే రియల్టర్ను చివరి నిమిషంలో తీసుకొచ్చారు. ఆయనెవరో కూడా జిల్లా ప్రజలకు తెలీదు. వైఎస్సార్సీపీ పార్లమెంట్లో అత్యంత బలంగా ఉండటం, బలమైన సామాజిక వర్గం, మంచితనం వెరసి రామయ్య గెలుపు నల్లేరుపై నడకే అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.డోన్, పాణ్యంలో దూకుడు!డోన్లో టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు రెండేళ్ల కిందటే ప్రకటించారు. అయితే సుబ్బారెడ్డి ఓడిపోతాడని సర్వేలో తేలడంతో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిని బరిలోకి దించారు. యూరోపియన్ మోడల్ విద్యాసంస్థలతో పాటు అన్ని రకాలుగా మంత్రి బుగ్గన డోన్ను అభివృద్ధి చేశారు. 2009 ఓటమి తర్వాత కోట్ల కుటుంబం డోన్ను వదిలేసింది. ఇప్పుడు ప్రకాశ్రెడ్డిని పంపింది. ఇష్టం లేకపోయినా డోన్కు వెళుతున్నారని ప్రకాశ్రెడ్డి కోడుమూరు కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ బుగ్గన గెలుపు లాంఛనమే అని విశ్లేషకులు చెబుతున్నారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున, గౌరు చరిత టీడీపీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే కాటసాని. నిత్యం ప్రజల్లో ఉంటారు. బైరెడ్డి, గౌరు ఏకం కావడం గౌరు వర్గీయులు కూడా జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ దఫా కూడా కాటసానికే అనుకూలంగా ఉంది. నంద్యాలలో గెలుపు నల్లేరుపై నడకే..నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి సౌమ్యుడు. రవితోపాటు ఆయన తండ్రి ఎప్పుడూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎవరు వెళ్లినా స్పందించే గుణం వారి సొంతం. మరో వైపు భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని ఫరూక్కు టీడీపీ టికెట్ ఇచి్చంది. దీంతో బ్రహ్మం పూర్తి దూరంగా ఉన్నారు. నంద్యాలపై పట్టున్న అఖిలప్రియ కూడా ఫరూక్కు సహకరించలేదు. ఈ దఫా ఫరూక్ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ తన తమ్ముడు జగత్ విఖ్యాత్కు ఇప్పించాలనేది అఖిల వ్యూహం. దీంతో వర్గవిభేదాలతో టీడీపీ నలిగిపోతోంది. బనగానపల్లిలో బోనస్ మార్కులే..బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి బలంగా ఉన్నారు. ఇక్క డ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి నియోజకవర్గం కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉంటారు. దీనికి తోడు డోన్, నంద్యాలలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో కోట్ల, భూమాకు ప్రత్య ర్థిగా మారారు. ఈ ఎన్నికల్లో వీరు ఇతని ఓటమి కోసం పని చేసే అవకాశం ఉంది. బీసీపై భూమా బ్రహా్మనందరెడ్డి ఏకంగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. ఇక్కడ కాటసానికి గెలుపు అవకాశాలు ఎక్కువ. నందికొట్కూరులో తిరుగులేని ఫ్యాన్!నందికొట్కూరులో వైఎస్సార్సీపీ తరఫున సు«దీర్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి శ్రమిస్తున్నారు. టీడీపీ తరఫున గిత్తా జయసూర్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాండ్రను కాదని నంద్యాల ఎంపీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమారై శబరికి ఇచ్చారు. మాండ్ర హైదరాబాద్లో ఉంటున్నారు. దీంతో జయసూర్య ఒంటరైపోయాడు. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నడిపిన గౌరు, బైరెడ్డి వర్గాలు ఏకం కావడం కూడా నందికొట్కూరులో జీరి్ణంచుకోలేని అంశం. దీంతో అంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. ఆళ్లగడ్డలో అఖిలకు ఎదురుగాలి..ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ తరచూ వివాదాలలో చిక్కు కుంటోంది. కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా దూరమయ్యారు. ‘భూమా’ ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి అఖిల ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంగుల ప్రభా కర్ రెడ్డి ఇద్దరూ ఆళ్లగడ్డలో ‘ఫ్యాక్షన్ ’ వాతావరణాన్ని తీసేసి ప్ర శాంతంగా మార్చారు. ఇదే వీరికి ఈ ఎన్నికల్లో బలంగా మారింది. -
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన రాజకీయ నేతలు ఎంతటి గొప్ప నటులో అర్ధం చేసుకునే సన్నివేశం అని చెప్పాలి. ఈ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్ లు రద్దు చేస్తారంటూ చెప్పిన నకిలీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు స్పందించి కొంతమందిని అరెస్టు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. ఇది మంచి విషయమే.తప్పుడు వీడియోలు, ఆడియోలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేయడం ద్వారా ఎన్నికలలో గెలవాలని దష్ట తలంపుతో ఉన్నవారికి ఇది గుణపాఠమే అవుతుంది. ఇంతవరకు ఓకే. కానీ.. అదే కేంద్ర మంత్రి పక్కన అలాంటి కేసులో ఉన్న ఒక వ్యక్తి నిలబడితే.. ఆ వ్యక్తిని ఆ మంత్రి పొగుడుతుంటే ఏమని అనాలి? ఎలా చూడాలి? ఇది ప్రజాస్వామ్య లోపమా? లేక వ్యక్తులలో నిజాయితీ,నిబద్దత లేనితనమా ?అంటే ఏమి చెబుదాం. ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక ఐవీఆర్ఎస్ ద్వారా లక్షల మందికి తప్పుడు సమాచారాన్ని పంపించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడుగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన తనయుడు లోకేష్ రెండో నిందితుడుగా ఉన్నారు. వీరిద్దరూ కాకుండా ఇంకో పది మందిపై కూడా కేసు నమోదైంది. ఇది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఐడీ పెట్టిన కేసే. హోం మంత్రి అమిత్ షా పై తప్పుడు వీడియో సృష్టిస్తే దేశవ్యాప్తంగా హడావుడి చేసి కొందరిని ఇప్పటికే అరెస్టు చేస్తే, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై తప్పుడు ఫోన్ కాల్ సృష్టించి ప్రచారం చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి పక్కన ఎలా ప్రచారంలో పాల్గొనగలుగుతారు. ఆ తదుపరి సాయంత్రానికే ఏపీ డీజీపీని బదిలీ చేయడం జరిగింది. అంటే.. ఏమిటి అర్ధం?.అమిత్ షా మార్ఫింగ్ వీడియోలు తయారు చేసినవారు జైలకు వెళతారు. అదే ఏపీ ముఖ్యమంత్రి పై తప్పుడు ఆడియోలు సృష్టిస్తే ,నిందితులపై కేసు నమోదు చేస్తే.. ఏకంగా డీజీపీనే బదిలీ అవుతారు. కూటమి నేతలు చంద్రబాబు,పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఒత్తిడికి లొంగే వారు డీజీపీని బదిలీ చేశారని జనం అనుకోరా?. ఇది డబుల్ స్టాండర్స్ కాదా? అంటే ఏమి చెబుతాం.విశేషం ఏమిటంటే ఆ చంద్రబాబు నాయుడుకు అమిత్ షా సర్టిఫికెట్ ఇవ్వడం. ఆయన వచ్చి జగన్ పై విమర్శలు చేయడం. 2019 ఎన్నికలకు ముందు తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు అమిత్ షాపై రాళ్లదాడి చేసి అవమానించారు. దేశ ప్రధాని మోదీని ఏకంగా టెర్రరిస్టు, మంచివాడు కాదు.. అసలు మోడీ దేశంలో ఉండడానికే తగడు అని దూషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిద్దరి సరసన దర్జాగా కూర్చోగలుగుతున్నారు. ఈ ఘట్టాలలో ఎవరు కరెక్టు అనుకోవాలి?. చంద్రబాబు ఏమైనా తన ప్రకటనలను ఉపసంహరించుకున్నట్లు ,క్షమాపణ కోరినట్లు తెలిపారా?.. అంటే అదేమీ లేదు. మరి దేనికి చంద్రబాబు వారి వద్దకు వెళ్లి బతిమలాడుకున్నారు. బీజేపీవారు ఎందుకు లొంగిపోయారు అంటే.. అదే బ్రహ్మ రహస్యం. పోలవరం ప్రాజెక్టు గురించి అమిత్ షా మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారు.అంటే వేరే వారు వస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వబోమని బెదిరిస్తున్నారా? ఏపీలో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీతో జతకట్టామని అమిత్ షా చెబితే నమ్మడానికి ఎవరూ చెవిలో పూలు పెట్టుకుని లేరు. 2019 ఎన్నికల ముందు ఆ తర్వాత ఎన్ని రకాలుగా చంద్రబాబును బీజేపీ నేతలు విమర్శించారో తెలియదా?. ఇప్పుడు వచ్చి కొత్త కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు?. గత ఐదేళ్లలో ఏపీలో ఉన్న ప్రశాంతత మరెక్కడైనా ఉందా?. కేవలం టీడీపీ, ఆ పార్టీని మోస్తున్న మీడియానే ఏ చిన్న ఘటన జరిగినా.. చిలవలు, పలవలు చేసి ప్రచారం చేయడం మినహాయించి మరేయితర ఘటనలు ఏమీ జరగలేదని చెప్పాలి. అమరావతి రాజధాని చేయడానికి కూటమి కట్టామని అంటున్నారు. అప్పట్లో ఈ అమరావతి , పోలవరం ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడుకు ఏటీఎంలు అయ్యాయని, ప్రధాని సహా పలువురు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు బహుశా అమిత్ షా మర్చిపోయి ఉండొచ్చు. ధర్మవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అదేదో తెలుగుదేశం పార్టీవారు రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా చదివినిట్లు ఉంది తప్ప.. బీజేపీ భావజాలానికి తగ్గట్లుగా మాట్లాడినట్లు అనిపించదు. కీలకమైన విశాఖ నగరానికి వ్యతిరేకంగా అమిత్ షాతో కూడా మాట్లాడించినట్లు అనుకోవాలా?.జగన్ పై ఏదో అవినీతి ఆరోపణలు చేయాలి కనుక చేసినట్లు ఉంది తప్ప, ఎన్నికల కోసం.. టీడీపీని సంతృప్తిపరచడం కోసం ఉపన్యసించినట్లు ఉంది తప్ప, అమిత్ షా సొంత ఆలోచనలకు తగ్గట్లు మాట్లాడలేదు. ఏపీలో అవినీతి గురించి మాట్లాడడానికి ముందు అమిత్ షా కొన్నింటికి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. 2019 లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కనుకొన్నట్లు సీబీటీడీ ప్రకటించిందా?లేదా?.. ఆ కేసు ఇంతవరకు అతీగతి లేకుండా పోయిందేమిటి?.. మోదీని, అమిత్ షా ను సంతోషపెడితే ఎంతటి కేసు అయినా హుష్ కాకి అవుతుందా?ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి మనీలాండరింగ్ తదితర ఆరోపణలపై ప్రశ్నలు వేస్తే చంద్రబాబు ఏదో దాటవేత జవాబులు ఇస్తూ తప్పించుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎందుకు కూర్చుంది?.స్కిల్ స్కామ్ తో సహా పలు కుంభకోణాలలో చంద్రబాబు పాత్ర ఉందని కేసులు నమోదు అయితే.. అలాంటి వ్యక్తి నాయకత్వంలోని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని అమిత్ షా జనానికి సుద్దులు చెబుతున్నారు. చంద్రబాబు చాలా అభివృద్ది చేశారట. జగన్ వచ్చాక జరగలేదట. ఇదే మాట గతంలో ఎన్నడూ ఎందుకు చెప్పలేదు?. అప్పట్లో చంద్రబాబు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేశారే. అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా వంద లేఖలు రాసి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించారే. అవన్నీ మర్చిపోయారా?..ఇవన్నీ ఎందుకు.. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన మాజీ ఎంపీ సుజనా చౌదరి బిజెపి పక్షాన ఎమ్మెల్యేగా విజయవాడ పశ్చిమం నుంచి పోటీచేస్తున్నారు. వందల కోట్లకు ఎగనామం పెట్టడమే కాకుండా కొన్ని చీటింగ్ కేసులలో కూడా ఉన్న మరో మాజీ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీచేస్తున్నారు. అంతకుముందు వీళ్లు టీడీపీలో ఉన్నారు. బీజెపీలో చేరగానే వాషింగ్ మెషిన్ వేసి శుద్ది చేసేశారని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. దేశం అంతటా ఇదే కథ నడుపుతున్న బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుకు సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న నానుడి గుర్తుకు వస్తుంది.శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతాం అని కూడా షా చెప్పారు. అహా ఎంత గొప్ప మాట అండి.ఇప్పుడు తిరుమల పవిత్రతకు ఏమీ భంగం రాలేదు. బీజేపీ వాళ్లు వచ్చి ఏ చిచ్చు పెట్టకుండా ఉంటే చాలు.తెలంగాణలో రెచ్చిపోయి ముస్లిం రిజర్వేషన్ లు రద్దు చేస్తామని ప్రసంగించే అమిత్ షా.. ఏపీలో మాత్రం ఆ ఊసే ఎత్తినట్లులేరు. ఏమిటి దీని భావం. ఏపీలో తెలుగుదేశం కూటమిలో ఉన్నందున ముస్లింలను మోసం చేయడానికి ఇక్కడ ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారా?. ఇదేనా మీ నిబద్దత. ఇది ప్రజలను వంచించడం కాదా?తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా ముస్లింలు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కదా?. వాటి గురించి నోరు ఎత్తకుండా వెళ్లిపోవడంలో ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించకపోరు.ఏది ఏమైనా చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేకపోయినా, ఏదో బలమైన ఒత్తిడి కారణంగా బీజేపీ ఈ కూటమిలో కలవడానికి అంగీకరించినట్లు అనిపిస్తుంది. అందుకే ఏదో మొక్కుబడిగా నాలుగుముక్కలు మాట్లాడి అమిత్ షా వెళ్ళినట్లు భావించవచ్చా?!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే!
బేతంచెర్ల: నెల రోజుల్లో ప్రజలందరీ ఆశీర్వాదంతో మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పాపసాని కొట్టాల, తవిసి కొండ, హుసేనాపురం, గూటుపల్లె గ్రామాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బుగ్గనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో బుగ్గన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలను రైతులగా మార్చిందన్నారు. గూటుపల్లె గ్రామంలో 300 మంది రైతులకు 500 ఎకరాల ప్రభుత్వ భూమి పంచడం జరిగిందన్నారు. డీ పట్టా భూములపై సర్వ హక్కులు కల్పించి 150 మంది రైతులకు మరో 200 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. వక్ఫ్ భూములలో ఉండి పోయి 1738 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయలేని విధంగా మిగిలిపోతే వాటిని కూడా కన్వర్షన్ చేయించే ప్రతి పాదనలను కలెక్టర్ ద్వారా వక్ఫ్ బోర్బు సీఈఓకు పంపినట్లు పేర్కొన్నారు. చెప్పిన్నవన్ని చేసే వారికి, చెప్పిందేది చేయని చంద్రబాబుకు మే 13వ తేదీన ఎన్నికల జరగనున్నాయన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి పార్టీలు ఫిరాయించిన నాయకులను నమ్మొద్దన్నారు. మాజీ ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి ఎంపీపీ పదవిని స్వలాభం కోసం మినహా ఏనాడు ప్రజల సాయం కోసం ఉపయోగించలేదన్నారు. రూ. 50 కోట్లతో మద్దిలేటి స్వామి ఆలయ స్వరూపాని మార్చడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. వేల కుటుంబాలకు కుల దైవమైన పాలుట్ల రంగస్వామి ఆలయం అభివృద్ధి ప్రతి ప్రక్షాలకు కనపడలేదాన్నారు. బేతంచెర్లలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా చేసుకోవడం అభివృద్ధి కాదా అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆశీర్వదించి, ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా పోచా బ్రహ్మనంద రెడ్డిని గెలిపించాలని మంత్రి బుగ్గన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, గిడ్డంగుల శాఖ డైరక్టర్ బాబుల్ రెడ్డి, గ్రామాల సర్పంచ్లు శ్రీరాములు, లక్ష్మీదేవి, వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ రంగస్వామి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, నాగేశ్వర్రెడ్డి, వెంకట స్వామి, పెద్ద రంగప్పగారి రంగస్వామి, శ్రీను, నాగేశ్వరరావు, బరగోడ్ల రంగస్వామి, రాజశేఖర్, మిద్దె శ్రీను, బండి కాటి వెంకటేశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనాథ్రెడ్డి,తిరుమలేశ్వర్రెడ్డి, తిమ్మయ్య పాల్గొన్నారు. డీ పట్టా భూములపై పేదలకు సర్వహక్కులు మద్దిలేటయ్య క్షేత్రాభివృద్ధి ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించదు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Photos
View allVideo
View allతప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement