సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో విద్యుత్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 2012-13 సంవత్సరంలో 113 మంది మృత్యువాతపడగా 27 పశువులు చనిపోయాయి. 2013-14లో 112 మంది ప్రాణాలు కోల్పోగా, 10పశువులు, ఇతర జంతువులు మృతిచెందాయి. ఈ ఏడాది ఏప్రిల్నుంచి ఇప్పటివరకు 45 మందికి పైగా విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. దశాబ్దాల కాలం నాటి విద్యుత్లైన్లు, వైర్లను మార్చకపోవడం, ఇళ్లమధ్యనే విద్యుత్లైన్లు ఉంచడం, పాతకాలం నాటిస్తంభాలు ఒరిగిపోవడం, సింగిల్ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ సక్రమంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో 130కేవీ సామర్థ్యం కలిగినవి 20 విద్యుత్ సబ్స్టేషన్ స్టేషన్లు ఉన్నాయి. 220 కేవీ కలిగిన స్టేషన్లు ఐదు, 400 కేవీ సామర్థ్యం కలిగిన ఒక సబ్స్టేషన్ ఉంది. వీటికింద 33/11 కేవీ విద్యుత్ వాడకం కలిగిన 269 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ట్రాన్స్ఫార్మర్లు 55,232 ఉన్నాయి. ఇందులో త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 36,176 కాగా, గృహఅవసరాల కోసం ఏర్పాటుచేసిన సింగల్ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు సుమారు 19,056 వరకు ఉన్నాయి. జిల్లాలో 51వేల కిలోమీటర్ల పొడవు విద్యుత్లైన్ ఉంది.
నిధులున్నా నిరూపయోగమే..!
ఇందులో 30, 40 ఏళ్ల నాటి విద్యుత్లైన్, వైర్లను మార్చాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ ఏటా పెండింగ్లోనే ఉంటోంది. జిల్లాలో విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలు తీర్చేందుకు విద్యుత్ కార్పొరేషన్ రూ.100 కోట్లు విడుదలచేసింది. వీటిలో 33 కేవీ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.15.26కోట్లు, గ్రామ, మండల కెపాసిటర్లు పెంచుకోవడం, అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.31.33కోట్లు మంజూరయ్యాయి.
అలాగే ఓవర్లోడ్ , పాతబడిన లైన్లను పునరిద్ధంచడం కోసం రూ.16 కోట్లు, కెపాసిటర్లు అమర్చుకోవడానికి రూ.4.73కోట్లు, సబ్స్టేషన్ల నిర్వహణ కోసం మరో రూ.15కోట్లు మంజూరయ్యాయి. అయితే ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులను నత్తనడకన కొనసాగుతున్నాయి. దీనికితోడు చాలా గ్రామాల్లో కొక్కెలు తగిలించుకోవడం, ఎర్తింగ్ లేకపోవడంతో హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ క్రమంలో నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వీధిన పడుతున్న కుటుంబాలు..
తరుచూ విద్యుత్ ప్రమాదాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. ఈ క్రమంలో వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ ఇంట్లో బట్టలు ఆరవేయబోయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచింది. దీంతో ఆ ఇంటికి ఉన్న ఏకైక పెద్దదిక్కును కోల్పోయారు.
అలాగేనాగర్కర్నూల్ మండలం చందుబట్ల గ్రామానికి చెందిన కాకునూరు బాలనాగయ్య కొత్త ఇంటికి నీళ్లు పట్టేందుకు మోటర్ ఆన్చేయబోగా కరెంట్షాక్కు గురై మృతిచెందాడు. దీంతో ఆయన ఇద్దరు పిల్లలు, భార్య పెద్దదిక్కును కోల్పోయారు. ఇలా ఎన్నోమంది రోడ్డునపడ్డారు. ఇంత జరిగినా ట్రాన్స్కో మాత్రం అరకొర సాయంతోనే సరిపెట్టుకుంటోంది. అరకొర సాయం అందించి చేతు లు దులుపుకుంటోంది. ఇలా చాలామేరకు కేసు లు పెండింగ్లో ఉన్నా యి. విద్యుత్షాక్కు గు రై మరణిస్తేనే రూ.లక్ష పరిహారం ఇస్తున్నారు. అదే అంగవైకల్యం కలిగిన వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదు.
ప్రాణాలు హరీ
Published Sun, Aug 3 2014 4:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement