► గుండిమెడ రైతుల ఆగ్రహం
► ఇసుక రీచ్ వద్ద నాలుగు గంటలపాటు ధర్నా
► లారీల కారణంగా పంటలు పాడైపోతున్నాయని ఆందోళన
► రహదారిపై నీళ్లు చల్లి వాహనాలు తిప్పుకోవాలని పోలీసుల సూచన
తాడేపల్లి రూరల్ : ఉచిత ఇసుక సరే... తమ పంట పొలాల సంగతేంటంటూ గుండిమెడ రైతులు గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద మంగళవారం నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు క్వారీ నిర్వాహకులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ఫ్లైయింగ్ స్వ్కాడ్ పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు పోలీసులతో మాట్లాడుతూ ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలు, ట్రాక్టర్ల వల్ల తమ పంట పొలాలకు వెళ్లే రహదార్లు పూర్తిగా పాడైపోయాయని వాపోయారు. నీళ్లు చల్లకపోవడం వల్ల రోడ్లపై నుంచి దుమ్ము లేచి పంట పొలాలపై పడి ఒక్కో రైతు రూ. 30-40 వేలు నష్టపోవాల్సివచ్చిందని తెలిపారు. ఇప్పుడు అడ్డకోకపోతే పండిన పంట దుమ్ము పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలు వచ్చే రహదారి వెంట 300-500 ఎకరాల జొన్న, మొక్కజొన్న పంట పొలాలుఉన్నాయి. మొక్కజొన్న అయితే కండె లు విరుచుకుంటామని, జొన్న పరిస్థితి అర్థం కావడం లేదని వాపోయారు. పోలీసులు రహదారుల వెంట నీళ్లు చల్లించి వాహనాలు తిప్పుతామంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
దీంతో పోలీసులు గుండిమెడ ఇసుక రీచ్లో తవ్వకాలు నిర్వహిస్తున్న పొక్లెయినర్ల యజమానులను పిలిపించి రైతుల పంటలు పాడవకుండా రహదారిపై నీళ్లు చల్లించాలని సూచించా రు. అయితే క్వారీలో 8 పొక్లెయిన్లు ఉండగా, ఇద్దరు యజమానులు మా త్రమే అక్కడకు వచ్చి రోజుకొకరు నీళ్లు చల్లుతామంటూ రైతులకు తెలియజేశారు. రైతులు మాత్రం మిగిలిన ఆరుగురితో కూడా నీళ్లు చల్లించే బాధ్యత మీరు తీసుకుంటారా? అని అడగడంతో వచ్చిన ఇద్దరు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని ప్రస్తుతానికి నీళ్లు చల్లిస్తున్నారు కదా, నీళ్లు చల్లించకపోతే అడ్డుకోవాలని సూచించడంతో రైతులు మెత్తబడ్డారు.
మట్టి కొట్టుకుపోతున్నాం!
Published Wed, Mar 30 2016 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement