జహీరాబాద్, న్యూస్లైన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజకు ప్రజాదరణ పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. బుధవారం జహీరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీలో చేరేందుకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి కుటుంబం ప్రస్తుతం ఆయన తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వైపు చూస్తుందన్నారు.
జగన్ సీఎం అయితేనే రాజన్న పథకాలు అందరికీ అందుతాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలోనూ పార్టీ ఉంటుందన్నారు. ఈ విషయంలో కొందరు కావాలని దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎ స్సార్సీపీ అభ్యర్థులు సత్తాచాటుతారని ధీమా వ్యక్తంచేశారు. జహీరాబాద్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ప్రజలు స్థానిక అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.ఉజ్వల్రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ పార్టీ ఇన్చార్జి ఎస్.నారాయణరెడ్డి, పార్టీ నాయకులు కలిమొద్దీన్, ముర్తుజా, జగన్, అత్తార్, సమి, ముబీన్, మోహన్రెడ్డి, సతీష్, జైపాల్రెడ్డి, ప్రవీణ్, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డిలు పాల్గొన్నారు.
ఎన్నికల్లో సత్తాచాటుతాం
రామచంద్రాపురం: ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స త్తా చాటుతామని ఆ పార్టీ బీసీ విభాగం హైదరాబాద్, ఖమ్మం జిల్లాల ఇన్చార్జ్ సతీష్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో ఆయ న మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో వైఎ స్సార్సీపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. దివంగతనేత వైఎస్సార్ చేసిన అభివృద్ది కార్యక్రమాలను గడపగడపకు వెళ్లి వివరిస్తామన్నారు. పేదల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రధానంగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలందరికి పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎందరికో ప్రాణా లు పోసిందన్నారు.
నేడు వైఎస్ ప్రజల మధ్య లేకున్నా పేదల గుండెల్లో కొలువై ఉన్నారని కొనియాడారు. అలాంటి మహనీయుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సొంత లాభాలే తప్ప ప్రజా సం క్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. కాం గ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజల కు పిలుపునిచ్చారు.
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ బలం ఉందన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ అభిమానులు ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ
Published Thu, Mar 27 2014 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement