సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : 2013-14 ఖరీప్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో 52,016 వేల హెక్టార్లలో వరి సాగవుతుందని భావించారు. అయితే నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన 42 మండలాల్లో 46,228 హెక్టార్లలో వరి పంటలు వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మేరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా.. దిగుబడిలో 25 శాతం అవసరాలు, ఇతర కారణాలతో విక్రయించే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో 1.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు 124 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యమైనా కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఒక్కో కేంద్రంలో 20 టార్పాలిన్లు, ఆ మేరకు గన్నీ సంచుల కోసం ఇండెంట్ ఇచ్చారు.
ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్..
డీఆర్డీఏ, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేసే ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాకొచ్చారు. మహిళా సంఘాలకు గతంలో ధాన్యం కొనుగోలుపై రూ.100కు రూ.1.50 చెల్లించిన ప్రభుత్వం గతేడాది నుంచి రూ.2.50కు పెంచింది. గత ఖరీఫ్లో 66,385 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన స్వయం సహాయక సంఘాలు రూ.2.10 కోట్ల కమీషన్ పొందాయి. గత రబీ సీజన్లో సైతం 30,510 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.97 లక్షల కమీషన్ తీసుకున్నారు.
ఈసారి స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున.. రూ.3.36 కోట్ల మేరకు కమీషన్ పొందే అవకాశం ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. కాగా గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,345, కామన్కు రూ.1.310 మద్దతు ధరపై నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రేడ్-ఏ, కామన్ రకాల ధాన్యంలో రా రైసుమిల్లుకు విరుగుడు 25 శాతం, బాయిల్డ్కైతే 16 మించకుండా చూడాలి. ధాన్యంలో తేమ 14 శాతం దాటితే కొనుగోలు చేయకూడదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. కాగా ఈ సారి ప్రభుత్వం పెంచిన మద్దతు ధర కంటి తుడుపుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈనెల 25 నుంచి ధాన్యం కొనుగోళ్లు..
డీఆర్డీఏ ఐకేపీల ద్వారా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొనుగోలు చేసే ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ గోదాములతోపాటు రైసుమిల్లుల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశాము. ఈ నెల 25 నుంచి 124 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పటికే కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సంబంధిత అధికారులు, సిబ్బందితో పలుమార్లు సమీక్షించారు. 21న నిర్మల్, 22న మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాల్లో కొనుగోళ్లను పర్యవేక్షించే, పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సులు కూడా ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలను పాటించి రైతులు కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర పొందాలని కోరుతున్నాము.
- పి.వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్డీఏ
సర్వం సన్నద్ధం...
Published Sun, Oct 20 2013 2:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement