ఏపీ గవర్నర్ భార్యకు నరసింహన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కీళ్ల మారి్పడి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సతీమణి సుప్రవ హరిచందన్ను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, విమల దంపతులు గురువారం పరామర్శించారు. ఆమెకు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని బిశ్వభూషణ్ వివరించారు. సుప్రవ త్వరగా కోలుకోవాలని నరసింహన్ దంపతులు ఆకాంక్షించారు.