మున్సిపల్ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్: ప్రభుత్వం ఖరారు చేసిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం అందజేస్తుంది.
ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లు 10 ఉన్నాయి. వాటిలో ఎస్టీ -1, ఎస్సీ -2, బీసీ -6, మహిళలు -5, రిజర్వు కానివి -5 ఉన్నాయి. మున్సిపాలిటీలను ఎస్టీ -4, ఎస్సీ -20, బీసీ -53, మహిళలు -41, రిజర్వు కానివి -41గా నిర్ణయించారు.
రిజర్వేషన్ల వివరాలు:
ఖమ్మం - ఎస్టీ (జనరల్)
రామగుండం - ఎస్సీ (జనరల్)
ఒంగోలు - ఎస్సీ (మహిళా)
ఏలూరు, కర్నూలు, చిత్తూరు - బీసీ (మహిళ)
జిహెచ్ఎంసి, కడప, నెల్లూరు - బీసీ (జనరల్)
కాకినాడ, రాజమండ్రి, నిజామాబాద్, అనంతపురం, తిరుపతి - (జనరల్ - మహిళ)
గుంటూరు, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్ - (అన్ రిజర్వ్డ్)