తిరుమల ఘాట్ రోడ్డులో మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి.
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. రెండవ ఘాట్ రోడ్డులో నాలుగు ప్రమాద ప్రాంతాలను గుర్తించిన ఐఐటీ నిపుణులు దీనిపై టీటీడీకి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా ప్రమాద ప్రాంతాలలో కొండచరియలపై కొమ్మలను టీటీడీ సిబ్బంది తొలగించారు. కూలడానికి సిద్దంగా ఉన్న కొండచరియలను కూడా ముందుగా తొలగించారు.