జీతాలు, పెన్షన్లకు మాత్రమే నిధులు
రెవెన్యూ వ్యయ బీఆర్వోలు జారీ కాకుండా చేసిన ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల స్కాలర్షిప్లు, ఆసుపత్రుల్లో మందులు, మెడికల్ రీయింబర్స్మెంట్, రవాణా భత్యం, హాస్టళ్ల మెటీరియల్, కార్యాలయాల నిర్వహ ణ వంటి రెవెన్యూ వ్యయాలకు ఆర్థిక శాఖ నిధుల విడుదలను నిలిపేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో నాల్గో త్రైమాసిక నిధులు సుమారు రూ.20 వేల కోట్ల విడుదల నిలిచిపోయింది. ఆ నిధులు విడుదల కాకుండా కంప్యూటర్లోనే ఆర్థిక శాఖ సీజ్ చేసింది. దీంతో రెవెన్యూ వ్యయానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వోలు) జారీ కావు. నాల్గో త్రైమాసిక నిధులను ఈ నెలలో విడుదల చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ లోటులోకి వెళ్లకుండా జాగ్రత్తల్లో భాగంగా ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, నిర్మాణాలకు మాత్రమే నిధులను విడుదల చేయనుంది.
ఆస్తుల కల్పనపై వ్యయం తగ్గిపోయి, రెవెన్యూ వ్యయం పెరిగిపోవడంతో ఆడిటర్ జనరల్ (ఏజీ) ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సెక్యూరిటీలు విక్రయించగా వస్తున్న కోట్ల రూపాయలను ఆస్తుల కల్పనపై కాకుండా రెవెన్యూ వ్యయానికి వినియోగిస్తున్నారంటూ ఆర్థిక శాఖకు ఏజీ లేఖ కూడా రాశారు. అయితే అప్పులను కచ్చితంగా ఆస్తుల కల్పనపైనే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. దీన్ని అతిక్రమిస్తున్నట్లు ఏజీ పేర్కొనడంతో ఇక తప్పని ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు వంటి ప్రణాళికేతర రెవెన్యూ వ్యయానికి, అలాగే ఆస్తుల కల్పనకు సంబంధించిన నిర్మాణ వ్యయానికి మాత్రమే నిధుల విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రణాళికా పద్దు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 59,442 కోట్లను వ్యయం చేయాల్సి ఉండగా డిసెంబర్ వరకు కేవలం రూ.28 వేల కోట్లను వ్యయం చేశారు. ఆర్థిక సంవత్సరం మరో రెండున్నర నెలల్లో ముగుస్తున్నప్పటికీ కీలకమైన ప్రణాళికా వ్యయం కేటాయింపుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. మరో పక్క ప్రణాళికేతర వ్యయం మాత్రం డిసెంబర్ నాటికి రూ. 61 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రణాళికేతరంలోకి వచ్చే రెవెన్యూ వ్యయాన్ని నిలుపుదల చేసి ప్రణాళికా వ్యయం పెంచాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
స్కాలర్షిప్లు, మందులకు నిధులు బంద్
Published Mon, Jan 13 2014 12:00 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
తప్పక చదవండి
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement