చిత్తూరు జిల్లా పాకాల మండలం బైలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
చిత్తూరు జిల్లా పాకాల మండలం బైలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికని బయల్దేరి వెళ్తున్న భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది.
దీంతో తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన నలుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.