పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Five Injured in Blast At Penna Cement Factory  - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top