మత్స్యకారుల ఆచూకి గల్లంతు? | Fishermans missed went for fishing | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల ఆచూకి గల్లంతు?

Jun 22 2015 2:58 AM | Updated on Sep 3 2017 4:08 AM

మత్స్యకారుల ఆచూకి గల్లంతు?

మత్స్యకారుల ఆచూకి గల్లంతు?

చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు...

- యలమంచిలి సీఐకు బంధువుల ఫిర్యాదు
యలమంచిలి :
చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆది వారం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ప్రకాశం జిల్లా చీరాల నుంచి సముద్రమార్గంలో బోటు పై ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంకు చెందిన మైలపల్లి కాశీరావు, మైలపల్లి కోటయ్య ఈ నెల 19న బయలుదేరారు.  శనివారం ఉదయానికే స్వగ్రామానికి చేరుకోవాలి.

మచిలీపట్నం తీరానికి వచ్చే వరకు వారు ఫోన్‌లో మాట్లాడారని, అప్పటి నుంచి సమాచారం లేకుండా పోయిం దని  కుటుంబ సభ్యులు ఆదివారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని పెంటకోట, కాకినాడ మెరైన్ పోలీస్టేషన్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన కాశీరావు, కోటయ్య నెల రోజుల క్రితం చేపల వేటకు ప్రకాశం జిల్లా చీరాల వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం 7 గంటలకు బోటుపై బంగారమ్మపాలెం బయలుదేరారు. ఆదివారం వరకు రాకపోవడంతో కుటుంబీకు ల్లో ఆందోళన ఎక్కువైంది.  ఆదివారం రాత్రి వరకు మత్స్యకారుల ఆచూకి తెలియకపోవడంతో సంబంధిత కుటుంబీకు లు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement