యానాం ఫెర్రీరోడ్‌లో భారీ అగ్నిప్రమాదం


రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని యానాం ఫెర్రీరోడ్‌లో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇళ్లలో 3 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 30 కుటుంబాలు నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top