15 ఇళ‍్లు దగ‍్ధం...70 మేకలు సజీవదహనం

సాక్షి, విజయనగరం: భోగాపురం పంచాయతీ వనుంపేటలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 15 ఇళ్లు దగ‍్ధం కాగా, మంటల్లో చిక్కుకుని 70 మేకలు సజీవదహనమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స‍్థలానికి చేరుకున‍్న అగ్నిమాపక సిబ‍్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ అస్తినష‍్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top