మగటపల్లి (మామిడికుదురు) : రెక్కలు పులిస్తే తప్ప డొక్కలు నిండని బడుగుజీవుల గూళ్లు భగ్గుమన్నాయి. చెమటోడ్చి సమకూర్చుకున్న సొమ్ము, సరుకులు, సామగ్రి బుగ్గి కాగా 45 కుటుంబాలు కట్టుబట్టలతో, కన్నీటితో మిగిలాయి. మండలంలోని మగటపల్లిలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శివాలయం కాలనీ బూడిద కుప్పగా మారింది. కాలనీవాసులు భోజనాలు చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక్కసారిగా ఎగసిన మంటలు చూస్తుండగానే కాలనీని చుట్టుముట్టేశాయి. 45 నిమిషాల వ్యవధిలో 37 పూరిళ్లు బూడిదకుప్పలుగా మిగిలాయి. నాలుగు మేకలు సజీవ దహనమయ్యాయి. 100కు పైగా కొబ్బరి చెట్లు కాలిపోయాయి. ఆస్తినష్టం రూ.25 లక్షలు పైబడి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదంలో నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలి పోయాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. శివాలయం కాలనీలో ఇప్పుడు పరిస్థితి భయానకంగా ఉంది. గ్రామానికి దూరంగా ఉండే ఈ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బాధితులంతా తలో దిక్కుకూ పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరు బాధితులు మంటల్ని చూసి స్పృహ తప్పి పడిపోయారు. పొయ్యి నుంచి లేచిన నిప్పురవ్వలు లేదా దీపం బుడ్డి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
కళ్ల ముందే గూళ్లు బూడిదయ్యాయి..
మూడు అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపు చేశాయి. అయితే శకటాలు కాలనీలోకి వెళ్లేందుకు దారిలేక పోవడంతో 500 మీటర్ల దూరం నుంచే మంటల్ని అదుపు చేయడానికి శ్రమించాల్సివచ్చింది. కూలి పనులు ముగించుకుని ఇళ్లకు చేరి, భోజనానికి ఉపక్రమించే వేళ ఎగసిన కీలలు వారి జీవితాల్లో మరిచిపోలేని చేదును మిగిల్చాయి. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కాలిపోయాయని కావడి ధనమ్మ, బత్తుల లక్ష్మమ్మ, యర్రంశెట్టి కృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి తాము ఎక్కడ తలదాచుకునేదంటూ బాధితులు రోదించారు. కాలనీని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సందర్శించి, బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వపరంగా సహాయం అందించి ఆదుకుంటామన్నారు.
కాలనీయే కాలి బూడిదైంది..
Published Sun, Nov 9 2014 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement