పండుగలకు పటిష్ట బందోబస్తు | Festivals Strengthening security arrangement | Sakshi
Sakshi News home page

పండుగలకు పటిష్ట బందోబస్తు

Oct 10 2013 2:11 AM | Updated on Sep 1 2017 11:29 PM

శరవన్నరాత్రులు, బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పటి ష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు

 కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: శరవన్నరాత్రులు, బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పటి ష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రవీందర్ తెలిపారు. పోలీస్ హెడ్‌కార్వర్టర్స్‌లో బుధవారం జిల్లా నేర సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ గోవధలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొలుసు దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని, పాత నేరస్థుల పై నిఘా పెంచామని చెప్పారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని, పోలీసులకు సమాచారం ఇ వ్వాలని కోరారు. బాణాసంచా దుకాణాలను నిర్దేశించిన ప్రాంతాల్లోనే వి క్రయించాలని సూచించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ నిరోధానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫి ర్యాదుకు రశీదు ఇవ్వాలని, జాప్యమై తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివారు దాబాల్లో మద్యం విక్రయాలు, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గడిచిన నెలలో సమర్ధవంతమైన సేవలందించిన పలువురికి రివార్డులు, జ్ఞాపికలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement