రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దు: యనమల | Sakshi
Sakshi News home page

రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దు: యనమల

Published Mon, Jun 23 2014 12:47 PM

farmers to don't repay loans, yanamala ramakrishnudu

హైదరాబాద్ : రైతులెవ్వరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. రుణాలు రీ షెడ్యూల్ చేసిన వాయిదాలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఏ సంవత్సరం వరకూ రుణమాఫీ చేస్తామన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని యనమల అన్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈ వయో పరిమితి పెంపు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ఉద్యోగులకు వర్తించదని అన్నారు.


 

Advertisement
 
Advertisement
 
Advertisement