గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం | farmer suicide in guntur district over tdp leaders assault | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం

Dec 14 2016 3:28 PM | Updated on Oct 1 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం - Sakshi

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల అరాచకం

రాష్ట్రంలో అధికార పార్టీల నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

గుంటూరు: రాష్ట్రంలో అధికార పార్టీల నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో టీడీపీ నేతలు మరోసారి బరి తెగించారు.

గ్రామంలోని చెరువులో టీడీపీ నేతలు అక్రమంగా క్వారీయింగ్కు పాల్పడ్డారు. గమనించిన స్థానిక రైతులు బుధవారం వారిని అడ్డుకోవడానికి యత్నించగా రైతులపై నేతలు దాడులకు దిగారు. ఈ దాడుల్లో రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన రైతులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement