'సెక్షన్ 8 పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తాం' | Sakshi
Sakshi News home page

'సెక్షన్ 8 పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తాం'

Published Sat, Jul 4 2015 8:23 PM

'సెక్షన్ 8 పై రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తాం'

హైదరాబాద్: పుష్కరాల నేపథ్యంలో వారానికోసారి కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.  పుష్కరాలకు కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జిలను ఆహ్వానిస్తామన్నారు. సెక్షన్ 8, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిపథకానికి ఆధార్ను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆక్టోబర్ 22 న పోలవరం నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వనిస్తామని తెలిపారు.
 

Advertisement
Advertisement