'తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరు' | Sakshi
Sakshi News home page

'తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరు'

Published Tue, Sep 16 2014 5:16 PM

'తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరు' - Sakshi

విజయవాడ: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడమే బీజేపీ విధానమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. మావోయిస్టులు తుపాకీ తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే అని నిరూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజా సహకారంతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేసేందుకు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement