‘వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు’ | CPI Ramakrishna Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు’

Published Mon, Aug 6 2018 1:11 PM | Last Updated on Mon, Aug 6 2018 2:30 PM

CPI Ramakrishna Fires On Chandrababu Naidu - Sakshi

రామకృష్ణ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, తిరుపతి : అధికారుల అవినీతి కారణంగానే కర్నూలు క్వారీ ఘటనలో పదిమంది మరణించారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలన అవినీతి మయంగా మారిందని మండిపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement