ఢిల్లీ వెళ్లేందుకు సాయిరెడ్డికి అనుమతి | Court allows Vijay Sai Reddy to visit Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లేందుకు సాయిరెడ్డికి అనుమతి

Oct 25 2013 3:55 AM | Updated on Aug 9 2018 2:49 PM

ఢిల్లీ వెళ్లేందుకు సాయిరెడ్డికి అనుమతి - Sakshi

ఢిల్లీ వెళ్లేందుకు సాయిరెడ్డికి అనుమతి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) విచారణ, అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పిలేట్ అథారిటీల విచారణలకు హాజరయ్యేందుకు వీలుగా ఆడిటర్ విజయసాయిరెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది.

సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) విచారణ, అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పిలేట్ అథారిటీల విచారణలకు హాజరయ్యేందుకు వీలుగా ఆడిటర్ విజయసాయిరెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. శుక్రవారం(ఈ నెల 25) నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆయన ఢిల్లీ వెళ్లేందుకు అనుమతిస్తూ సీబీఐ రెండో అదనపు కోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఢిల్లీకి వెళ్లేముందు కనీసం ఒకరోజు ముందు కోర్టుకు, సీబీఐకి సమాచారం ఇవ్వాలని, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని న్యాయమూర్తి షరతు విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement