యాచారం, న్యూస్లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించినా సక్రమంగా రైతులకు బిల్లులు ఇవ్వరు. పోనీ కొనుగోలు చేసిన మక్కలనైనా తరలిస్తారంటే.. అదీ లేదు. మొత్తంగా కొనుగోళ్ల వ్యవహారాన్ని అధికారులు గాలికొదిలినట్టు కన్పిస్తోంది. యాచారం మండలంలో మహిళా సమాఖ్య, ఐకేపీ సంయుక్తంగా చింతపట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రానికి మండలంలోని రైతులే కాకుం డా మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని పలు మండలాల నుంచి 200మంది రైతులకుపైగా సోమవారం వరకు 8,111 క్వింటాళ్ల మొక్కజొన్నలు విక్రయాలు జరిపారు. విక్రయాలు జరిపిన రైతులకు క్వింటాల్కు రూ.1,310 చొప్పు న రూ.కోటి పది లక్షల వరకు డబ్బులు అందాల్సి ఉంటుంది.
కానీ రైతులకు సగం బిల్లులు కూడా అందలేదు. కొనుగోలు కేంద్రంలో ప్రారంభంలో విక్రయాలు జరిపిన వారం రోజుల్లోనే రైతులకు బిల్లులు ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించినా సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నిత్యం చెప్పులరిగేలా తిరగక తప్పడం లేదు. ఇదిలాఉంటే మక్కల బస్తాలు ఏ రక్షణ లేకుండా కొనుగోలు కేంద్రాల వద్దే మూలుగుతున్నాయి. సుమారు 200 క్వింటాళ్ల మక్కల బస్తాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తూ మొలకలొస్తున్నాయి. కొనుగోళ్లు జరిగిన తర్వాత మక్కల బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ ఉత్పత్తులు ఏ మాత్రం ఉపయోగానికి రాని దుస్థితి ఏర్పడింది.
పంటలు వేసుకోవటానికి సిద్ధం
వర్షాలు సంవృద్ధిగా కురిసి భూగర్భజలాలు పెరగడం వల్ల వరితోపాటు వివిధ రకాల పంటలు వేసుకోవటానికి రైతులు సిద్ధమవుతున్నారు. చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విక్రయాలు జరిపిన రైతుల్లో అత్యధికంగా వరి సాగు చేసేవారే ఉన్నారు. ఒక్కో రైతుకు రూ.వేలాది బిల్లులు అందాల్సి ఉంది. విక్రయించిన మొక్కజొన్న డబ్బులు సకాలంలో అందకపోవడం, నాటేసే సమయం దగ్గరపడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
ఈ నెల చివరి వరకే కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు
ఈ నెల చివరి వరకే మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక ఐకేపీ, సమాఖ్య సభ్యులకు ఆదేశాలందాయి. గత కొద్ది రోజుల కింద ఇబ్రహీంపట్నంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం బంద్ కావడంతో ఇబ్రహీంపట్నం పరిసరాల గ్రామాల నుంచి రైతులు చింతపట్లలోని కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నలు విక్రయాలకు తరలి స్తున్నారు. అధికారుల ఆదేశాలతో ఐకేపీ, సమాఖ్య సిబ్బంది ఈనెల 20లోపు రైతులకు ఇచ్చిన బస్తాల వరకే మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 20 తర్వాత వచ్చిన రైతులకు బస్తాలు ఇవ్వడం నిలిపేశారు. కొద్ది రోజులుగా చింతపట్ల కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను అధికారులు సకాలంలో తరలించకపోవడం, భద్రపర్చుకునే స్థలం లేక గోదాం బయటనే నిల్వ ఉంచారు. చలి, కురిసే వర్షాలకు వందలాది క్వింటాళ్ల మొక్కజొన్న మొలకెత్తడంతోపాటు, బూజు పట్టింది. కొనుగోలు చేసిన వెంటనే తరలిస్తామని అధికారులు హామీలు ఇవ్వడమే కానీ ఆచరణలో శ్రద్ధ పెట్టడంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
నెల కింద విక్రయించా...
చింతపట్ల కొనుగోలు కేంద్రం లో 38 క్వింటాళ్ల మొక్కజొన్నలు నెల కింద విక్రయించా. విక్రయించిన మొక్కజొన్నకు రూ.49వేలకు పైగా నేటికీ బిల్లులు అందలేదు. చెప్పులరిగేలా తిరగగా సోమవారం చెక్ ఇచ్చారు. అది కూడా 27న తేదీ వేసి ఇచ్చారు. సాగు పనులు దగ్గరపడుతుంటే భయం నెలకొంది. - ముత్యాల సాయిరెడ్డి, నానక్నగర్
కొనుగోలు కేంద్రాని కొనసాగించాలి
చింతపట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మరో పక్షం రోజలకు పైగా నిర్వహించాలి. నేటికీ రైతులు పలు గ్రామాల నుంచి వందలాది క్వింటాళ్ల మొక్కజొన్నలు తీసుకోస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలి. లేదంటే రైతులు నష్టపోతారు.
- లిక్కి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ, చింతపట్ల
ప్రోత్సాహం లేదు
కొనుగోలు కేంద్రం నిర్వాహణ సక్రమంగా చేయాలని చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికారుల నుంచి ప్రోత్సాహం లేదు. వెనువెంటనే మొక్కజొన్నలు తరలించకపోవడం వల్ల వందలాది క్వింటాళ్ల నిల్వలు అలానే ఉంటున్నాయి. నేటికీ రైతులకు రూ.లక్షలాది బిల్లులు ఇవ్వాలి. రైతులు నిత్యం తిరుగుతున్నారు. - స్రవంతి, ఎస్ఆర్పీ మార్కెటింగ్ ఐకేపీ
మొలకెత్తిన నిర్లక్ష్యం!
Published Tue, Dec 24 2013 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement