= ధాన్యం రవాణా టెండర్లలో గోల్మాల్
= అధికారులకు చిక్కకుండా అడ్డదారులు
= అన్నింటికీ సింగిల్ టెండర్లే
= మహిళా సంఘాల వాటికీ గాలం
వరంగల్, న్యూస్లైన్ : ధాన్యం రవాణా టెండర్లలో కాంట్రాక్టర్లు రింగయ్యారు. కొత్తవారిని రానీయకుం డా అడ్డుకుని... బేరసారాలు నడిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తగ్గకుండా... హెచ్చు ధరలకే దక్కించుకునేందు కు సఫలీకృతులయ్యారు. 10 డివిజన్లకు పిలిచినా అన్నింటికీ ఒక్కటీ, రెండు టెండర్లు మా త్రమే దాఖలయ్యాయి. జిల్లాలో త్వరలో ప్రా రంభమయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేసేందుకు ఈనెల 1న టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. జేసీ కార్యాలయంలో ఈనెల 2 నుంచే సీల్డ్ టెండ ర్లు స్వీకరించారు.
ఎనిమిది రోజుల నుంచి ఒక్క టెండరూ దాఖలు కాలేదు. గురువారం ఆఖరి రోజు కావడంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. దీంతో టెండరు దాఖలు చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు రిం గయ్యారు. గురువారం సాయంత్రం వరకు టెండర్ల స్వీకరణ ముగిసింది. మొత్తం దాఖ లైన టెండర్లను ఈనెల 17న తెరువనున్నారు. 0.2 కిలోమీటరు నుంచి 16 కిలోమీటర్ల వర కు ఒక్క టన్నుకు రూ.185, ఈ తర్వాత ప్రతీ పది కిలోమీటర్లకు ఒక్క టన్నుకు రూ.365 చెల్లిం చేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.
దీనికోసం టెండర్లను పిలిచారు. 65 టన్నుల లారీలున్న ట్రాన్స్ఫోర్ట్ కంపెనీలకు అర్హతగా ప్రకటించారు. సీల్డ్ టెండరు వేయాలని, టెండరు సమయంలో రూ.5వేలు డీడీ చెల్లించాలని నిబంధనలు విధించారు. టెండ రు దక్కితే రూ.4 లక్షలు ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
అంతా కలిసిపోయారు..
టెండర్లను దక్కించుకునేందుకు గతంలో పని చేసిన కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. దీని లో కూడా రాజకీయ ప్రోద్భలం చోటు చేసుకోం ది. అధికార పార్టీ నేతలతో పైరవీ చేయిం చారు. కొత్తగా టెండర్ వేసేందుకు వచ్చిన వారిని ముందుగా బెదింరించి... ఆ తర్వాత ప్రలోభాలకు గురిచేశారు. టెండర్లు పట్టుకుని వచ్చిన వారికి తలా కొంత మొత్తం చేతిలో పెట్టి... సింగిల్ టెండర్లకు రింగయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రూపాయి తగ్గకుండా టెండర్లు దాఖలు చేశారు. ములు గు ప్రాంతం నుంచి వచ్చిన ఓ కాంట్రాక్టర్ను టెండరు దాఖలు చేసే కార్యాలయం వద్దే బహిరంగంగా బెదిరింపులకు గురిచేశారు. వారి బెదిరింపులకు భయపడి టెండరు వేయకుండానే వెనుదిరిగారు.
దీంతో పది డివిజ న్లకు ఒక్కటి... రెండు టెండర్లే దాఖలయ్యా యి. మొత్తం పది డివిజన్లలో రెండు డివిజన్లలకు మహిళా సంఘాలకు కేటాయించారు. వాటిలో కూడా కాంట్రాక్టర్ల ఆధిపత్యమే నడిచింది. సంఘాలను వేయనీయకుండా కాం ట్రాక్టర్లే ఒక్కరితోనే టెండరు వేయించారు. ములుగు-1 డివిజన్, జనగామ-2 డివిజ న్లను మహిళా సంఘాలకు కేటాయించగా వాటికి ఒక్కొక్క టెండరు మాత్రమే దాఖలైం ది. అదే విధంగా మహబూబాబాద్-1 డివిజ న్కు 2 టెండర్లు, మహబూబాబాద్-2కు 2 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి.
ములుగు-1కు సింగిల్ టెండరు వేశారు. ములుగు-2కు 2 టెండర్లు, ములుగు-3లో 2, వరంగల్-1కు సింగిల్ టెండరు, వరంగల్-2 డివిజన్కు 2 టెండర్లు దాఖలయ్యాయి. అదే విధంగా జనగామ-1 డివిజన్కు 2, జనగామ-2కు సింగిల్ టెండరు వేశారు. నర్సంపేట డివిజన్కు 2 టెండర్లు దాఖలు చేశారు. రెండు టెండర్లు దాఖలైన డివిజన్లలో ఒక్క కాంట్రాక్టరే రెండేసి టెండర్లు వేశారు. మొత్తానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రూపాయి తగ్గకుండా పూర్తిస్థాయిలో దక్కించుకునేందు కు వేసుకున్న ఎత్తులన్నీ ఫలించాయి.
కాంట్రాక్టర్ల రింగ్
Published Fri, Oct 11 2013 3:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement