బొలేరోను ఢీకొన్న లారీ : కాంట్రాక్టర్ మృతి | Contractor killed in road accident at chittoor district | Sakshi
Sakshi News home page

బొలేరోను ఢీకొన్న లారీ : కాంట్రాక్టర్ మృతి

Feb 6 2014 8:29 AM | Updated on Aug 30 2018 3:56 PM

చిత్తూరు జిల్లా పాకాల మండలం పదిపెట్లబైలు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా పాకాల మండలం పదిపెట్లబైలు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ ఘటనలో బొలేరోలో ప్రయాణిస్తున్న కాంట్రాక్టర్ మల్లిఖార్జున నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లిఖార్జున నాయుడు మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. మృతుడు మల్లిఖార్జున నాయుడు రొంపిచర్ల మండలం దద్దాలవారిపల్లెకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement