రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్ మృతి | contractor dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్ మృతి

Apr 25 2015 8:55 AM | Updated on Apr 3 2019 8:07 PM

ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

శింగరాయకొండ: ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన దర్శి రత్నం(61) క్లాస్-1 కాంట్రాక్టర్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులను కలిసేందుకని కారులో నెల్లూరు వెళ్తుండగా శింగరాయకొండ సమీపంలోని కలికివాయి గ్రామం వద్దఓవర్‌టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రగాయాలపాలుకాగా, రత్నం అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుడిని శింగరాయకొండ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement