మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారు? | congress sr leader veerappa moily slams three years of modi government | Sakshi
Sakshi News home page

మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారు?

May 26 2017 4:21 PM | Updated on Mar 23 2019 9:10 PM

మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారు? - Sakshi

మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారు?

ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని వీరప్ప మొయిలీ అన్నారు.

విశాఖ : రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. పాలన అంతా సంగ్‌ పరివార్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో అందరూ ఇబ్బంది పడ్డారని, చివరకు ప్రతి లావాదేవిపై పన్ను వేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్‌ అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ మరి విజయ్‌ మాల్యాను విదేశాలకు ఎందుకు పంపించారని మొయిలీ ప్రశ్నించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement