14 న మన్యం మహాధర్నా | congress conduct manyam maha dharna on july 14 | Sakshi
Sakshi News home page

14 న మన్యం మహాధర్నా

Jul 12 2017 1:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఏజెన్సీలో గిరిజనులు విషజ్వరాలతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.

విజయవాడ: విశాఖ ఏజెన్సీలో గిరిజనులు విషజ్వరాలతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. గిరిజనుల మరణాలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌​ చేశారు. ఏజెన్సీలపై టీడీపీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 న విశాఖ జిల్లా పాడేరులో ఐటీడీఏ సెంటర్‌ ఎదుట ఏపీసీసీ ఆధ్వర్యంలో మన్యం మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
 
ఈ మహాధర్నాను కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ మన్యం ప్రాంతంలోని గిరిజనుల మరణాలు , ఆరోగ్యం, సబ్‌ ప్లాన్‌ నిధులు తదితర అంశాలపై పోరాడేందుకే ఈ ధర్నాను చేస్తున్నట్టు తెలిపారు. మన్యంలో వైద్యసేవలు మెరుగు పడటం లేదన్నారు. మూడేళ్ల నుంచి వైద్య నిపుణుల నియామకం జరగలేదని తెలిపారు. ఈ ధర్నాలో ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజా, మాజీ కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ లతో పాటు రాష్ట్ర, కేంద్ర నాయకులు పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement