ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు తీర్పును విరుద్ధంగా దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారులో ప్రయాణించినందుకు తెలుగు యువత నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. నగర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారు వాడారని ఆరోపించారు.
కాగా దిగ్విజయ్పై కేసు నమోదు చేయలేదని, ఈ విషయాన్ని విచారిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఈ విషయంపై డిగ్గీరాజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల్ని అడగాలన్నారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే ఎర్రబుగ్గ కార్లను వాడాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికారు పదవుల్లో లేని దిగ్విజయ్ ఎర్రబుగ్గ కారు వాడటం వివాదాస్పదమైంది.
Breadcrumb
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్పై ఫిర్యాదు
Published Fri, Dec 13 2013 10:48 PM
Related news
-
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ లోక్సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్గఢ్లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్గఢ్లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
కాంగ్రెస్ 4వ జాబితా
కాంగ్రెస్ 4వ జాబితా -
33 ఏళ్ల తర్వాత రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలోని రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాజ్గఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని అధిష్ఠానం తనను ఆదేశించిందని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి నుండి నిరాకరిస్తూనే వస్తున్నారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని 29 లోక్సభ స్థానాలకు బీజేపీ జాబితా విడుదల చేసినా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలోని దిగ్గజ నేతలను రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాజ్గఢ్ లోక్సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రకటనతో కాంగ్రెస్ మద్దతుదారులు బాణాసంచా కాల్చి, తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్గఢ్ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల తర్వాత తిరిగి రాజ్గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గమనార్హం. కాగా ఇవే ఆయనకు ఆఖరి ఎన్నికలు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
Sowmya Janu: దాడి చేసింది సినీనటి సౌమ్య జాను
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోంగార్డుపై దాడికి పాల్పడింది సినీనటి సౌమ్యజాను గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన ఓ మహిళ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడిపై దాడికి పాల్పడింది. పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా సంఘటనకు కారణమైన మహిళను సినీనటి సౌమ్య జానుగా గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా అందుబాటులో లేదని తెలిపారు. ఆమె సెల్ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్లో ఉన్నాయన్నారు. ఆమెపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సౌమ్యజాను సంఘటన అనంతరం ఓ చానెల్కు ఇచి్చన ఇంటర్వ్యూలో తాను అత్యవసర పనిపై వెళుతూ రాంగ్రూట్లో వచి్చనట్లు అంగీకరించారు. అయితే తనను అక్కడ విధుల్లో ఉన్న పోలీసు బూతులు తిట్టినందునే తాను ఎదురుదాడి చేయాల్సి వచి్చందన్నారు. తాను అతని లైఫ్ జాకెట్ చించలేదని తెలిపారు. తాను కూడా హోంగార్డుపై ఫిర్యాదు చేస్తానన్నారు. తనను పోలీసులు విచారణకు పిలవలేదని ఆమె స్పష్టం చేశారు. -
ఆ కేసు కథ కంచికేనా?
సాక్షి, హైదరాబాద్: ఇతర కేసుల మాట ఎలా ఉన్నా.. అత్యాచారం ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులకు మాత్రం పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. బాధితురాలిని వెంటనే భరోసా సెంటర్కు పంపడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా తోడయ్యే వాటి విషయంలో మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటారు. అయితే బంజారాహిల్స్ ఠాణాలో ఇన్స్పెక్టర్గా పని చేసి, లంచం ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదై, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఓ అధికారి తీరు మాత్రం దీనికి భిన్నం. తన వద్దకు వచ్చిన బాధితురాలికి న్యాయం చేయడం మాట అటుంచి ‘పెద్దలైన’ నిందితులతో కలిసి ఆమెనే బెదిరించాడు. ఈ కారణంగానే దారుణమైన ఉదంతానికి సంబంధించిన ఈ కేసు నమోదు దాదాపు నాలుగు నెలలు ఆలస్యమైంది. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు కేసును సీసీఎస్కు బదిలీ చేయడంతో పాటు సదరు ఇన్స్పెక్టర్ను నిందితుడిగా చేర్చాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అప్పట్లోనే ఫిర్యాదు చేసిన బాధితురాలు... జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్ మురళీ ముకుంద్, ఆయన కుమారుడు ఆకర్ష్ కృష్ణ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివసిస్తున్నారు. వీరి వద్ద పని చేస్తున్న ఓ దళిత యువతిపై (22) అత్యాచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గత ఏడాది జూన్లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న మురళీ ముకుంద్ కుటుంబీకులు ఈ కేసు నమోదు కాకుండా చూడటానికి ఆ బాధితురాలినే బెదిరించాలని పథకం వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన ప్రోద్భలంతో ముకుంద్ కుటుంబీకులు బాధితురాలిపై ఓ ‘చిత్రమైన కేసు’ పెట్టారు. ఆమె తమ ఇంట్లో పని చేస్తూ ఐఫోన్లోని సిమ్కార్డులు తస్కరించినట్లు అందులో ఆరోపించారు. ఈ ఫిర్యాదును బాధితురాలికి చూపించిన సదరు ఇన్స్పెక్టర్ బెదిరింపులకు దిగారు. ముకుంద్ కుటుంబీకులపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే ఈ ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. ఆమెకు జరిగిన అన్యాయానికి రేటు... అక్కడితో ఆగకండా ఆ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించాడు. పలుమార్లు ఆమెకు ఫోన్ చేసిన సదరు అధికారి పదేపదే బెదిరింపులకు దిగాడు. ఓ దశలో ఆమెకు జరిగిన అన్యాయానికి రూ.1.7 లక్షల రేటు కట్టిన ఇన్స్పెక్టర్ ముకుంద్ కుటుంబీకుల నుంచి ఆ మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సెటిల్మెంట్ చేసినందుకు సదరు అధికారికి భారీ మొత్తమే ముకుంద్ కుటుంబీకుల నుంచి అందినట్లు తెలిసింది. ఈ ఖాకీ బెదిరింపులకు భయపడిన బాధితురాలు తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని మిన్నకుండిపోయింది. గత ఏడాది అక్టోబర్లో జరిగిన పరిణామాలతో ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న బాధితురాలు ధైర్యం చేసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు విషయాన్ని అప్పటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వారి ఆదేశాల మేరకు ఈ కేసును మహిళ భద్రత విభాగం అధికారులకు అప్పగించారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వాస్తవాలు.. తమ దర్యాప్తులో భాగంగా మహిళ భద్రత విభాగం బాధితురాలిని సంప్రదించింది. ఆమె నుంచి వాంగ్మూలం సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఇన్స్పెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై మహిళ భద్రత విభాగం అధికారులు నగర పోలీసు కమిషనర్కు నివేదిక అందించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బంజారాహిల్స్ మాజీ ఇన్స్పెక్టర్పై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టంలో ఓ కీలకాంశం ఉంది. ఈ ఆరోపణల కింద వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి నిరాకరించిన, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులనూ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యాచారం కేసును దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మురళీ ముకుంద్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మాజీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకునే అంశానికి అనివార్య కారణాల నేపథ్యంలో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
Related News by category
-
అమరజీవికి అవమానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగన్నాథం ఇటీవల యాదవులను నోటికొచ్చినట్లు తిట్టారు. వారిని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఫోన్ సంభాషణలో బెదిరించారు.ఇప్పుడు గొండు శంకర్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాతీపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా మాట్లాడారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్కు ఆ పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి ప్రపోజల్ పెట్టామని బహిరంగ ప్రకటన చేశారు. తండ్రీకొడుకులిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు హా ట్ టాపిక్ అయ్యాయి.ఇప్పటివరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు నగర అభివృద్ధికి పాటు పడ్డారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లా కేంద్రం అభివృద్ధిలో కీలక భూ మిక వహించారు. రిమ్స్ ఆస్పత్రి, ప్రధాన వంతెనలు, రోడ్లు, కలెక్టరేట్, స్టేడియం, పార్కులు, మా ర్కెట్, శాలిహుండం, అరసవల్లి దేవాలయం అభివృద్ధి, శ్రీకూర్మం దేవాలయం అభివృద్ధి, కళింగపట్నం బీచ్ అభివృద్ధి, డంపింగ్ యార్డ్, తాగునీరు సరఫరా... ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.జిల్లాలోనైతే వంశధార ప్రాజెక్టు, ఆఫ్షోర్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్, మడ్డువలస రి జర్వాయర్, అంబేడ్కర్ యూనివర్సిటీ, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పపత్రి, ఉద్దానం మంచినీ టి ప్రాజెక్టు తదితర అభివృద్ధి పనుల్లో భాగస్వా మ్యం అయ్యారు. ఆయనే కాదు గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి, అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేసి, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఎన్నడూ ఇలా ప్రముఖుల పేర్లు తీసేస్తామని వివాదాస్పదంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న గొండు శంకర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఒక కులాన్ని దూషించగా, గొండు శంకర్ ఏకంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో కీలక వ్యక్తుల పేరుతో కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసి వాటికి పేరు పెట్టడమో, లేదంటే వారిని గౌరవించేందుకు, స్మరించేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడమో చేయాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి గౌరవం ఎంతో మంది ప్రముఖులకు లభించింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అంధవరపు వరం మరణించాక ఆయన విగ్రహాన్ని ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరికొంత ప్రముఖుల విగ్రహాలను నగరంలో ఆవిష్కరించారు. అంతేగానీ అప్పటికే ఉన్న వాటికి ప్రముఖుల పేర్లు తీసేయడం చేయలేదు. గొండు శంకర్ సమాజానికి ఏం సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో గానీ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ మార్కెట్కు ఆయన పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామనడం వివాదాస్పదమైంది. ఆయన పేరు ను ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసిన దానికి పెడతామ ని చెప్పాలే తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల పేరును తీసేస్తామనడం, దానికో సం ఎంపీ రామ్మోహన్నాయుడికి ప్రతిపాదన పెట్టా మనడం వైశ్య వర్గాన్నే ఆశ్చర్యపరిచింది. వైశ్యుల ముద్దు బిడ్డగానే కాదు రాష్ట్రమంతా గొప్పగా భావించే పొట్టి శ్రీరాములు పేరు తీయాలన్న ఆలోచన రావడమే దారుణమని, ఇలాంటి వికృత చర్యలతో ఏం చేద్దామనుకుంటున్నారని వైశ్య వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. -
ఎన్నికల వేళ కలకలం.. సోషల్ మీడియాలో అమిత్ షా ఫేక్ వీడియో!
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామెంట్స్ ఉన్నాయి. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. .@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024 ఇక, వీడియోపై కాంగ్రెస్ స్పందించింది. రిజర్వేషన్ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫేక్ వీడియోపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాలవీయా.. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది. చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం.. నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా కాటంరెడ్డి
గుంటూరు, సాక్షి: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నియమించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో విష్ణువర్దన్కు బాధ్యతలు అప్పజెప్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర సమయంలో ఏప్రిల్ 4వ తేదీన తిరుపతి ఎద్దల చెరువు వద్ద సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.కాగా, 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే టీడీపీ స్థితి నానాటికీ దిగజారిపోతుండడం, ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిపోతూ వస్తున్న కారణంగా ఆయన టీడీపీని వీడారు. -
బెదిరింపుల పర్వం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే, దరిదాపుల్లో కూడా నిలవలేం. అవకాశం ఉన్న చోట పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకునే చర్యలు చేపట్టాలి. అందుకు ఎవరి స్థాయిలో వారు పనిచేయండి. నా ప్రమేయం అవసరమైన చోట చెప్పండి. నేనే స్వయంగా రంగంలోకి దిగుతా. నయానో.. భయానో ఈమారు అనుకూలంగా మలుచుకోవాలి. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వర్తించండి. మరీ ముఖ్యంగా ఈ ఏడు గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. అని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు దిశా–నిర్దేశం చేశారు. ఆపై బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. దేవగుడి పరిసర ప్రాంతాలైన గొరిగెనూరు, ధర్మాపురం, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె, శేషారెడ్డిపల్లె, శిరిగేపల్లె గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ఉన్నప్పుడు ఆయా గ్రామాల ప్రజలు దేవగుడి కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. దేవగుడి సోదరులు తెలుగుదేశం పారీ్టలో చేరిన తర్వాత అదే గ్రామాలకు చెందిన వారు వైఎస్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చాక, ఇప్పుడు అవే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోదరులను ఆయా నేతలపైకి ఉసిగొల్పారు. సౌమ్యంగా మద్దతు కోరండి, డబ్బు ఆశ చూపండి, అప్పటికీ మీమాట వినని వారితో నేను స్వయంగా మాట్లాడతా.. తర్వాత దౌర్జన్యం చేసేందుకు కూడా వెనుకడవద్దని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే ఆ ఏడు గ్రామాలకు చెందిన నాయకులతో వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ మంచిగా మద్దతు కోరుతున్నట్లు సమాచారం. రాబోవు రోజుల్లో మరింత స్పీడు పెంచి భయపెట్టుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే దరిదాపుల్లో కూడా పోటీలో నిలువలేమనే అంచనాకు దేవగుడి సోదరులు వచ్చినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో దాదాపు 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందినట్లు గుర్తించారు. ఓటుకు వెళ్తే అభ్యర్థులతో నిమిత్తం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా వైఎస్సార్సీపీకి మద్దతు లభిస్తున్నట్లు గ్రహించారు. ఇక పాత తరహాలో పోలింగ్ చేపట్టకపోతే ఉపయోగం లేదనే అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మైలవరం మండలంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ సర్పంచ్పై బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీకి ప్రచారం వరకే పరిమితం కావాలని, పోలింగ్కు మూడు రోజుల ముందు నుంచి గ్రామంలో ఉండొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పాత రోజులను గుర్తు చేయవద్దనే తరహాలో బెదిరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పరిస్థితిని బట్టి డబ్బులకు మెత్తబడే వారిని డబ్బుతో వశపరుచుకోవాలని, అలా కాదన్నవారి విషయాలపై దౌర్జన్యాకు సైతం వెనుకాడవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టి గ్రామస్థాయి నేతలు భయభాంత్రులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement