గిరిజనులకు అన్యాయం జరగనివ్వం | CM YS Jagan assures tribal MLAs | Sakshi
Sakshi News home page

గిరిజనులకు అన్యాయం జరగనివ్వం

Jun 18 2020 4:45 AM | Updated on Jun 18 2020 4:45 AM

CM YS Jagan assures tribal MLAs - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న గిరిజన ఎమ్మెల్యేలు

సాక్షి, అమరావతి: గిరిజన ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని టీచర్‌ పోస్టులను 100 శాతం గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఏపీలో జారీ అయిన జీవో నంబర్‌ 3ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని వారు సీఎంను కోరారు. జీవో నంబర్‌ 3ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చినట్టు సీఎం వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించి వారి సలహాలు తీసుకునేందుకు గురువారం గిరిజన సలహా మండలి (ట్రైబల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌) సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశారు. సీఎంను కలిసిన వారిలో తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కె.కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి తదితరులున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement