ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్లో పడి మృతి చెందింది.
తాడిపత్రి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్లో పడి మృతి చెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దలవిన్న గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రసాద్, లక్ష్మీ దంపతులకు రెండేళ్ల చిన్నారి నవిత. ఈ రోజు ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశత్తూ నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో తల్లి ఇంటి పని చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.