చిన్నంపల్లిలో చిరుత కలకలం | chetha outrage in ananthapuram district | Sakshi
Sakshi News home page

చిన్నంపల్లిలో చిరుత కలకలం

Jan 21 2015 2:03 PM | Updated on Sep 2 2017 8:02 PM

చిన్నంపల్లిలో చిరుత పులి ప్రత్యక్షమవటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు

అనంతపురం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చిన్నంపల్లిలో చిరుత పులి కలకలం సృష్టించింది. చిరుత సంచారంతో  గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లుకు చెందిన పొలంలో చిరుత పడుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు  అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

కాగా చిరుత పులి గాయపడి ఉండటం కాని లేదా గర్భం దాల్చి ఉండవచ్చునని, అందువల్లే  అక్కడి నుంచి కదలడం లేదని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. వలల ద్వారా చిరుతను పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా  మండల పరిధిలో చిరుత దాడి చేసి మేకలను, గొర్రెలను తిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement