4న జిల్లాకు చంద్రబాబు | Chandrababu Naidu tour in anaparthy | Sakshi
Sakshi News home page

4న జిల్లాకు చంద్రబాబు

Sep 29 2014 12:44 AM | Updated on Sep 2 2017 2:04 PM

4న జిల్లాకు చంద్రబాబు

4న జిల్లాకు చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు రానున్నారు. వచ్చేనెల రెండు నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్న ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాన్ని జిల్లాకు సంబంధించి

 అనపర్తి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు రానున్నారు. వచ్చేనెల రెండు నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్న ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాన్ని జిల్లాకు సంబంధించి అనపర్తిలో నాలుగో తేదీన ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు జిల్లాకు మొదటిసారి నగరం గ్యాస్ విస్ఫోటం బాధితుల్ని పరామర్శించేందు, రెండోసారి రాజమండ్రిలో జన-ధన కార్యక్రమం ప్రారంభానికి వచ్చారు. పింఛన్ల పంపిణీతో పాటు  వైద్య ఆరోగ్య శిబిరాలు, పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పరిశుభ్రత-ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామీణులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కాగా అనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనా ఆ రోజు ఎక్కడ, ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే  దానిపై త్వరలో జిల్లా నేతలతో సంప్రదించి ఒక నిర్ణయానికి రానున్నామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement