డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ | chandrababu naidu meets Andhra pradesh dgp, police officials | Sakshi
Sakshi News home page

డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ

Jun 15 2015 10:51 AM | Updated on Sep 3 2017 3:47 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో ఏపీ డీజీపీ రాముడు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు ప్రతిరోజూ పోలీసులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో చంద్రబాబు...తాజా పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఏసీబీ డీజీతో కూడా ఆయన నిన్న భేటీ అయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement