డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో ఏపీ డీజీపీ రాముడు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా చంద్రబాబు ప్రతిరోజూ పోలీసులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో చంద్రబాబు...తాజా పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఏసీబీ డీజీతో కూడా ఆయన నిన్న భేటీ అయ్యారు.