కరెంట్‌ పోతే కాల్‌ చేయండి

Chandra Sekar Reddy Comments About complaints received by the Power Department - Sakshi

అన్ని జిల్లాలకు కామన్‌ నంబర్‌ 1912

గాలిదుమ్ముల సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు

తక్షణ స్పందనకు ప్రత్యేక బృందాలు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరిస్తున్నారని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ శాఖకు సంబంధించి అందుతున్న ఫిర్యాదులపై ఆయన సమీక్ష జరిపారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. 

కేంద్రీకృత కాల్‌ సెంటర్లు
► విద్యుత్‌ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కేంద్రీకృత కాల్‌ సెంటర్‌ ఏర్పాటు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 1912 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.
► స్థానికంగా కేటాయించిన నంబర్లను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. సమస్య తలెత్తినప్పుడు ఎన్ని గంటల్లో పరిష్కరించారనే విషయం నమోదవుతుంది.
► ప్రజలు ఫోన్, విద్యుత్‌ శాఖ వెబ్‌ సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

ప్రత్యేక ఏర్పాట్లు
► ఈదురు గాలులు, వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో అదనంగా పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం. 
కోవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రుల వద్ద ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎక్కడా విద్యుత్‌ అంతరాయం ఏర్పాట్లు.
► గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యుత్‌ శాఖ అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top