breaking news
State Department of Energy
-
కరెంట్ పోతే కాల్ చేయండి
సాక్షి, అమరావతి: విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరిస్తున్నారని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో విద్యుత్ శాఖకు సంబంధించి అందుతున్న ఫిర్యాదులపై ఆయన సమీక్ష జరిపారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కేంద్రీకృత కాల్ సెంటర్లు ► విద్యుత్ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కేంద్రీకృత కాల్ సెంటర్ ఏర్పాటు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 1912 నంబర్కు ఫోన్ చేయొచ్చు. ► స్థానికంగా కేటాయించిన నంబర్లను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. సమస్య తలెత్తినప్పుడు ఎన్ని గంటల్లో పరిష్కరించారనే విషయం నమోదవుతుంది. ► ప్రజలు ఫోన్, విద్యుత్ శాఖ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ప్రత్యేక ఏర్పాట్లు ► ఈదురు గాలులు, వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో అదనంగా పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం. ► కోవిడ్ క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రుల వద్ద ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎక్కడా విద్యుత్ అంతరాయం ఏర్పాట్లు. ► గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యుత్ శాఖ అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
నెలాఖరులోగా కీలక పోస్టులు ఖాళీ
- దక్షిణ డిస్కం సీఎండీ,ఐదుగురు డెరైక్టర్ల పదవీ కాలం పూర్తి - ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో నెలాఖరులోగా ఆరు కీలక పదవులు ఖాళీ అవుతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) జి.రఘుమారెడ్డి పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ఇదే సంస్థ ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ జి.శ్రీనివాస్రెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ బి.నర్సింగ్రావు, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) మానవ వనరుల విభాగం డెరైక్టర్ ఎస్.అశోక్కుమార్, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో) ట్రాన్స్మిషన్ విభాగం డెరైక్టర్ టి.జగత్రెడ్డి, గ్రిడ్ విభాగం డెరైక్టర్ జి.నర్సింగ్రావుల పదవీకాలం సైతం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. టీఎస్ఎస్పీడీసీఎల్లో ఫైనాన్స్, కమర్షియల్ విభాగాలకు సంబంధించిన రెండు డెరైక్టర్ల పదవులు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఖాళీ డెరైక్టర్ పదవుల సంఖ్య ఏడుకు పెరగనుంది. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మరో ఐదుగురు డెరైక్టర్ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో వారి పదవీకాలాన్ని పొడిగించి మరో దఫా అవకాశం కల్పించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అన్న అంశంపై ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పనితీరు, సమర్థత ఆధారంగా వీరిలో కొందరికి పొడిగింపు లభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖలో అత్యంత కీలకమైన టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ పోస్టుపై విద్యుత్ శాఖ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరో దఫా పొడిగింపుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. పదవీ విరమణ చేసిన పలువురు అధికారులు సైతం తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిసింది. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాలరావును నియమించాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన వెంటనే అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే తరహాలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ, డెరైక్టర్ల పదవీకాలం ముగింపు రోజే సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారని, అప్పుడే ఉత్తర్వులు జారీ అవుతాయని ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.