సమావేశాలకు నన్ను ఆహ్వానించాలి: సాయిరెడ్డి | central, state government not invited me for government programmes, says vijayasai reddy | Sakshi
Sakshi News home page

సమావేశాలకు నన్ను ఆహ్వానించాలి: సాయిరెడ్డి

Mar 30 2017 4:13 PM | Updated on May 24 2018 2:18 PM

విశాఖలో ఏర్పాటు చేసే సమావేశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తను ఆహ్వానించడం లేదని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభ ప్రస్తావించారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి విశాఖలో ఏర్పాటు చేసే సమావేశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తను ఆహ్వానించడం లేదని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభ ప్రస్తావించారు. సంప్రదాయాలను పాటించడం లేదని, పద్ధతులను విస్మరిస్తున్నారంటూ ఆయన ఈ విషయాన్ని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకం చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన డిప్యూటీ చైర్మన్‌ స్థానిక సమావేశాలకు ఎంపీలను విధిగా పిలవాల్సిందేనని స్పష్టం చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement