విజయవాడ : పేకాట శిబిరంపై పోలీసుల దాడి సందర్భంగా వారి నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు కాలువలో దూకి గల్లంతయ్యాడు. లబ్బీపేట పిచ్చయ వీధి చివర పార్కులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..
లబ్బీపేట మసీదు వీధిలో నివాసం ఉంటున్న కార్పెంటర్ ఎస్కే మస్తాన్కు ఆరుగురు సంతానం. ఆయన చిన్న కుమారుడు ఎస్కే ఫయాజ్(18) ఆటోనగర్లోని టైర్ల కంపెనీలో పనిచేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం విధుల నుంచి ఇంటికి వచ్చాడు. అదే ప్రాంతంలోని పిచ్చయవీధి చివర పార్కులో కొంతమంది పేకాడుతున్నారు. ఫయాజ్ తన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. అక్కడ ఆరుగురు పేకాడుతుండగా, మరికొందరు నిలుచుని చూస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు శిబిరంపై దాడి చేశారు. వారికి నలుగురు చిక్కారు. మరికొందరు సబ్స్టేషన్ వెనుక నుంచి పరారయ్యారు. ఫయాజ్తో సహా మరో నలుగురు తప్పించుకునేందుకు కాలువలో దూకారు. వారిలో ముగ్గురు ఆవలి ఒడ్డుకు చేరుకోగా, ఫయాజ్ మాత్రం నీటిలో గల్లంతయ్యాడు.
కుటుంబసభ్యుల ఆరాతో వెలుగులోకి..
ఫయాజ్ రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటికి రాకపోవడంతో సోదరుడు అహ్మద్ అతడికి ఫోన్ చేయగా, స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అతడి స్నేహితులను ఆరా తీయగా, జరిగిన ఘటన గురించి వివరించారు. దీంతో కాలువలో కొట్టుకుపోయినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో బుధవారం ఉదయం బందరు కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి, ఫయాజ్ జాడ కోసం బంధువులు, పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫయాజ్ జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సీఐ అహ్మద్ ఆలీ చెప్పారు.
నాయకుల పరామర్శ
ఫయాజ్ కాలువలో దూకి గల్లంతయ్యాడని తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత బందరు కాలువ ఒడ్డున ఉన్న పార్కు వద్దకు వచ్చారు. అతడి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కార్యాలయ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నేతలు కొందరు కూడా వచ్చి ఈ ఘటనపై బాధిత కుటుంబీకుడిని ఆరా తీశారు.
బందరురోడ్డుపై ధర్నా
ఫయాజ్ జాడ తెలుసుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అతడి బంధువులు, స్థానికులు బందరురోడ్డుపై రాస్తారోకో చేశా రు. పోలీసులు వారితో సంప్రదింపులు జరి పారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ధర్నా ప్రారంభమైన గంట తరువాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. దీంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు.
కాలువలో దూకి యువకుడి గల్లంతు
Published Thu, Oct 30 2014 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement