ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా? | c. ramachandraiah slams on tdp government | Sakshi
Sakshi News home page

ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా?

Aug 22 2014 1:14 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా? - Sakshi

ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా?

రైతు రుణమాఫీ గురించి ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటన చేస్తే సరిపోదని.. గ్రౌండ్‌ లెవల్లో పరిస్థితిని చూడాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రభుత్వానికి సూచించారు.

హైదరాబాద్ : రైతు రుణమాఫీ గురించి ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటన చేస్తే సరిపోదని.. గ్రౌండ్‌ లెవల్లో పరిస్థితిని చూడాలని కాంగ్రెస్‌  ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రభుత్వానికి సూచించారు. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని.. అన్నదాతల ఆత్మహత్యలు మొదలయాయ్యని ఆయన శుక్రవారం శాసనమండలిలో ప్రస్తావించారు.

తాను ప్రభుత్వంపై నిందలు  వేయడానికి చెప్పడం లేదని.. వాస్తవ పరిస్థితి సభ దృష్టికి తెస్తున్నానని తెలిపారు. దేవుడి కంటే రైతే ఎక్కువ అన్న వ్యవసాయ మంత్రి పుల్లారావు  వ్యాఖ్యలను రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఎద్దు వెనుక కాదు.. శవాల వెనుక ఈ ప్రభుత్వం వస్తుందని ఆయన  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement