'చంద్రబాబునూ నిందితుడిగా చేర్చాలి' | c.ramachandraiah slams chandrababu naidu over mlc elections | Sakshi
Sakshi News home page

'చంద్రబాబునూ నిందితుడిగా చేర్చాలి'

Jun 1 2015 10:47 AM | Updated on Sep 17 2018 6:08 PM

'చంద్రబాబునూ నిందితుడిగా చేర్చాలి' - Sakshi

'చంద్రబాబునూ నిందితుడిగా చేర్చాలి'

ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో రూ.5 కోట్ల డీల్ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో రూ.5 కోట్ల డీల్ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా నిందితుడిగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరపాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు. 

రేవంత్ రెడ్డి కేవలం పావు మాత్రమే అని...అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడేనని సి.రామచంద్రయ్య ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఇది అత్యంత హేయమైన చర్య అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగినా ఇది అత్యంత దారుణమైన చర్య అని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement